ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ ధరలపై ఎయిర్ లైన్స్ కువైట్ సూచనలు

- February 02, 2021 , by Maagulf
ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ ధరలపై ఎయిర్ లైన్స్ కువైట్ సూచనలు

కువైట్ సిటీ:పలు దేశాల నుంచి కువైట్ ఇంటర్నేనల్ ఎయిర్ పోర్టుకు చేరుకునే ప్రయాణికులు తప్పనిసరిగా పీసీఆర్ టెస్టులు నిర్వహించుకోవాలని ఆదేశించిన డీజీసీఏ..ల్యాబ్ ఛార్జీలపై మరోసారి స్పష్టతనిచ్చింది.విమాన ప్రయాణికులకు రెండు విడతలుగా నిర్వహించే పీసీఆర్ టెస్ట్ ఛార్జీలు 60 దినార్లకు మించి ఉండరాదని సూచించింది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లుగా టెస్ట్ గరిష్ట దర 30 దినార్లకు మించకూడదన్న నిబంధనలకు అనుగుణంగా రెండు టెస్టులకు కలిపి 60 దినార్లను నిర్ణయించినట్లు వివరించింది.అయితే..రెండు టెస్టులకు కలిపి 60 దినార్లు దాటొద్దని ఆదేశిస్తూనే..విమానయాన సంస్థలు సింగిల్ టెస్టుకు 30 దినార్లు అనేది తప్పనిసరి కాదంటూ మరో మెలిక పెట్టింది.అయితే..దీన్ని ఎలా అమలు చేస్తాయో అనేది స్పష్టత రావాల్సి ఉంది.ఇదిలాఉంటే..విమానాల సంఖ్య పరిమిత సంఖ్యలో ఉండటం కారణంగా ఫ్లైట్ ఛార్జీలు రాకెట్ లా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com