ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ ధరలపై ఎయిర్ లైన్స్ కువైట్ సూచనలు
- February 02, 2021
కువైట్ సిటీ:పలు దేశాల నుంచి కువైట్ ఇంటర్నేనల్ ఎయిర్ పోర్టుకు చేరుకునే ప్రయాణికులు తప్పనిసరిగా పీసీఆర్ టెస్టులు నిర్వహించుకోవాలని ఆదేశించిన డీజీసీఏ..ల్యాబ్ ఛార్జీలపై మరోసారి స్పష్టతనిచ్చింది.విమాన ప్రయాణికులకు రెండు విడతలుగా నిర్వహించే పీసీఆర్ టెస్ట్ ఛార్జీలు 60 దినార్లకు మించి ఉండరాదని సూచించింది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లుగా టెస్ట్ గరిష్ట దర 30 దినార్లకు మించకూడదన్న నిబంధనలకు అనుగుణంగా రెండు టెస్టులకు కలిపి 60 దినార్లను నిర్ణయించినట్లు వివరించింది.అయితే..రెండు టెస్టులకు కలిపి 60 దినార్లు దాటొద్దని ఆదేశిస్తూనే..విమానయాన సంస్థలు సింగిల్ టెస్టుకు 30 దినార్లు అనేది తప్పనిసరి కాదంటూ మరో మెలిక పెట్టింది.అయితే..దీన్ని ఎలా అమలు చేస్తాయో అనేది స్పష్టత రావాల్సి ఉంది.ఇదిలాఉంటే..విమానాల సంఖ్య పరిమిత సంఖ్యలో ఉండటం కారణంగా ఫ్లైట్ ఛార్జీలు రాకెట్ లా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







