ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

- February 03, 2021 , by Maagulf
ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏ.పీలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి..ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 25,445 సాంపిల్స్ పరీక్షించగా.. 95 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరొకరు మృతిచెందారు. ఇదే సమయంలో 129 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు పరీక్షించి సాంపిల్స్ సంఖ్య 1,32,14,548కు చేరుకోగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,099కు పెరిగింది.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,162 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇప్పటి వరకు 8,79,780 మంది పూర్తిగా కోలుకోగా..7,157 మంది కరోనాతో మృతిచెందారు కరోనా బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం..కాగా, రోజుకో కొత్త రికార్డు తరహాలో భారీగా నమోదు అవుతూ వచ్చిన పాజిటివ్ కేసులు.. ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com