ఏ.పీలో కరోనా కేసుల వివరాలు
- February 03, 2021
అమరావతి:ఏ.పీలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి..ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 25,445 సాంపిల్స్ పరీక్షించగా.. 95 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. మరొకరు మృతిచెందారు. ఇదే సమయంలో 129 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు పరీక్షించి సాంపిల్స్ సంఖ్య 1,32,14,548కు చేరుకోగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,099కు పెరిగింది.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,162 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇప్పటి వరకు 8,79,780 మంది పూర్తిగా కోలుకోగా..7,157 మంది కరోనాతో మృతిచెందారు కరోనా బులెటిన్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం..కాగా, రోజుకో కొత్త రికార్డు తరహాలో భారీగా నమోదు అవుతూ వచ్చిన పాజిటివ్ కేసులు.. ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







