కోవిడ్ ఎఫెక్ట్: అజ్మన్ లో అర్ధరాత్రి తర్వాత హోటల్స్, కేఫ్ లు బంద్
- February 05, 2021
అజ్మన్ పరిధిలోని హోటల్స్, కేఫ్స్ సమయాలను కుదిస్తూ ఆర్ధికాభివృద్ధి అధికార విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎట్టిపరిస్థితుల్లోని హోటల్స్, కేఫ్స్ మూసివేయాల్సిందేనని ఆదేశించింది. వినియోగదారులను అనుమతించొద్దని సూచించింది. అయితే..హోమ్ డెలివరీకి మాత్రం అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 5 నుంచి ఎమిరాతి పరిధిలోని అన్ని హోటళ్లు, కేఫ్ లు ఈ నిబంధన పాటించాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు యూఏఈ ఆరోగ్య శాఖ నిర్ణయం మేరకు పలు ఎమిరాతి పాలన యంత్రాంగాలు పలు రంగాలపై ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలె దుబాయ్ కూడా హోటల్స్, రెస్టారెంట్లను అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత మూసివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే బాటలో అజ్మన్ పాలన యంత్రాంగం కూడా హోటల్స్, కేఫ్స్ పై ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







