బస్ లేన్ వినియోగించే మోటరిస్టులకు 600 దిర్హాముల జరీమానా

- February 05, 2021 , by Maagulf
బస్ లేన్ వినియోగించే మోటరిస్టులకు 600 దిర్హాముల జరీమానా

దుబాయ్: ఖాలెద్ బిన్ వాలీద్ వద్ద కొత్తగా ప్రారంభించిన డెడికేటెడ్ బస్ లేన్‌ని దుర్వనియోగం చేసే మోటరిస్టులకు 600 దిర్హాముల జరీమానా విధించబడుతుంది. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ) ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 21న ఈ లేన్ ప్రారంభించగా, ఇప్పటిదాకా గ్రేస్ పీరియడ్‌ వుంది. ఆ గ్రేస్ పీరియడ్ ముగిసిందనీ, జరీమానాలు ఆదివారం నుంచి మొదలవుతాయని అథారిటీ పేర్కొంది. ఈ లేన్‌పై మొత్తం 22 కెమెరాలు ఉల్లంఘనల్ని గుర్తించనున్నాయి. ఆర్‌టిఎకి చెందిన బస్సులు అలాగే ట్యాక్సీల కోసం డెడికేటెడ్ లేన్ అందుబాటులోకి తెచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com