కోవిడ్ 19: కొత్త నిబంధనలు జారీ చేసిన ఖతార్
- February 05, 2021
దోహా:కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకోసం మళ్ళీ కొత్త నిబంధనల్ని ఖతార్ అమల్లోకి తెచ్చింది. ఎడ్యుకేషన్, లీజర్, బిజినెస్ యాక్టివిటీస్ వంటివాటికి సంబంధించి మళ్ళీ నిబంధనలు కఠినతరం చేయడం జరిగింది. ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్, థీమ్ పార్కులు, రెస్టారెంట్ కెపాసిటీలు వంటి వాటికి సంబంధించి పలు నిబంధనల్ని కొత్తగా అమల్లోకి తెచ్చాయి అథారిటీస్. ఖతారీ మార్కెట్లు కేవలం 50 శాతం సామర్థ్యంతోనే ఇకపై పనిచేయాలి. ఇంటి వద్ద జరగని పెళ్ళిళ్ళపై బ్యాన్ విధించారు. ఇంటి వద్ద వివాహాల్లో కేవలం బంధువులకు మాత్రమే అవకాశం కల్పించాల్సి వుంటుంది. నర్సరీలు 30 శాతం సామర్థ్యంతో పనిచేయాలి. ఈ నిబంధనల్ని మినిస్ట్రీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. పార్కు్ల్లో ఔట్ డోర్ గేదరింగ్స్ విషయానికొస్తే, ఇది కేవలం 15 మందికే పరిమితం. ఇండోర్ గేదరింగ్స్ అయితే కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం. బోట్ రెంటల్స్పై నిషేధం విధించారు. పర్సనల్ బోట్ల సామర్థ్యం 15 మందికే పరిమితం చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







