కోవిడ్ 19: కొత్త నిబంధనలు జారీ చేసిన ఖతార్
- February 05, 2021
దోహా:కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకోసం మళ్ళీ కొత్త నిబంధనల్ని ఖతార్ అమల్లోకి తెచ్చింది. ఎడ్యుకేషన్, లీజర్, బిజినెస్ యాక్టివిటీస్ వంటివాటికి సంబంధించి మళ్ళీ నిబంధనలు కఠినతరం చేయడం జరిగింది. ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్, థీమ్ పార్కులు, రెస్టారెంట్ కెపాసిటీలు వంటి వాటికి సంబంధించి పలు నిబంధనల్ని కొత్తగా అమల్లోకి తెచ్చాయి అథారిటీస్. ఖతారీ మార్కెట్లు కేవలం 50 శాతం సామర్థ్యంతోనే ఇకపై పనిచేయాలి. ఇంటి వద్ద జరగని పెళ్ళిళ్ళపై బ్యాన్ విధించారు. ఇంటి వద్ద వివాహాల్లో కేవలం బంధువులకు మాత్రమే అవకాశం కల్పించాల్సి వుంటుంది. నర్సరీలు 30 శాతం సామర్థ్యంతో పనిచేయాలి. ఈ నిబంధనల్ని మినిస్ట్రీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. పార్కు్ల్లో ఔట్ డోర్ గేదరింగ్స్ విషయానికొస్తే, ఇది కేవలం 15 మందికే పరిమితం. ఇండోర్ గేదరింగ్స్ అయితే కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం. బోట్ రెంటల్స్పై నిషేధం విధించారు. పర్సనల్ బోట్ల సామర్థ్యం 15 మందికే పరిమితం చేశారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







