కువైట్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే 6 నెలల జైలు శిక్ష..10 వేల దినార్ల ఫైన్
- February 06, 2021
కువైట్ సిటీ:కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అంటు వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు దేశంలోని ప్రతి ఒక్కరు సుప్రీం కమిటీ సూచించిన అన్ని ముందస్తు జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి పది వేల దినార్ల వరకు జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుందని..ఉల్లంఘన తీవ్రతను బట్టి జైలుశిక్ష, జరిమానా రెండు విధించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. సమాజ ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా నడుచుకోవాలని సూచించింది. పబ్లిక్ గ్యాదరింగ్స్ కు దూరంగా ఉండి భౌతిక దూరం పాటించాలని చెప్పింది. చివరికి నేషనల్ హాలీడేస్ సెలబ్రేషన్లలో కూడా ఎవరూ గుమికూడొద్దని, పబ్లిక్ ఈవెంట్లే కాదు ప్రైవేట్ సెలబ్రేషన్స్, చివరికి ఇంటిలో కూడా వేడుకలు చేసుకోకపోవటం మంచిదని అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









