కువైట్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే 6 నెలల జైలు శిక్ష..10 వేల దినార్ల ఫైన్
- February 06, 2021
కువైట్ సిటీ:కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అంటు వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు దేశంలోని ప్రతి ఒక్కరు సుప్రీం కమిటీ సూచించిన అన్ని ముందస్తు జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి పది వేల దినార్ల వరకు జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుందని..ఉల్లంఘన తీవ్రతను బట్టి జైలుశిక్ష, జరిమానా రెండు విధించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. సమాజ ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా నడుచుకోవాలని సూచించింది. పబ్లిక్ గ్యాదరింగ్స్ కు దూరంగా ఉండి భౌతిక దూరం పాటించాలని చెప్పింది. చివరికి నేషనల్ హాలీడేస్ సెలబ్రేషన్లలో కూడా ఎవరూ గుమికూడొద్దని, పబ్లిక్ ఈవెంట్లే కాదు ప్రైవేట్ సెలబ్రేషన్స్, చివరికి ఇంటిలో కూడా వేడుకలు చేసుకోకపోవటం మంచిదని అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







