అబుధాబిలోని కరోనా ఆంక్షలు..సినిమా హాళ్లు క్లోజ్, మాల్స్ పై పరిమితి విధింపు
- February 06, 2021
యూఏఈలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతుండటంతో పలు ఎమిరాతిలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. కింగ్డమ్ గత కొన్ని వారాలుగా దాదాపు 3000పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు ఎమిరాతిలు తమ పరిధిలోని ఈవెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పలు రంగాలను పరిమిత సేవలకు కదిస్తూ తాత్కాలిక ఆంక్షలు విధించాయి. యూఏఈ రాజధాని అబుధాబి కూడా కరోనా ఆంక్షలను కఠినం చేసింది. ఎమిరాతి పరిధిలోని సినిమా హాళ్లను పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు హాల్స్ తెరవకూడదని స్పష్టం చేసింది. షాపింగ్ మాల్స్ లో 40 శాతం వినియోగదారులకు మాత్రమే అనుమతించాలని, రెస్టారెంట్లు, కేఫ్ లలో పూర్తి కెపాసిటీలో 60 శాతం వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎమిరాతిలోని అన్ని సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ నిర్వహాకులకు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది లాక్ డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే వ్యాపారాలు గాడిన పడేందుకు అడుగులు పడుతున్న సమయంలో మళ్లీ ఆంక్షలు అమలులోకి రావటం...పలు రంగాలకు దెబ్బ మీద దెబ్బ పడినట్లైంది. అయినా..ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఎమిరాతి పాలన యంత్రాంగం సూచనల మేరకు తదుపరి నోటీసులు వచ్చే వరకు సినిమా స్క్రీన్లను మూసివేస్తున్నామని వీఓఎక్స్ సినిమాస్ నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







