ఐవీఆర్ఎస్ నంబర్ ప్రవేశపెడుతామని కేంద్ర రైల్వే శాఖ
- February 25, 2016
ప్రయాణికుల నుంచి నేరుగా సలహాల కోసం ప్రత్యేక ఐవీఆర్ఎస్ నంబర్ ప్రవేశపెడుతామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. సాధారణ ప్రయాణికులు, రైల్వేకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేకుండా చూస్తున్నామని తెలిపారు. ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి డిస్పోజబుల్ బెడ్ షీట్లు ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగా 74 రైళ్లలో ఆన్బోర్డ్ హౌస్కీపింగ్ సేవలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. 2015-16లో ఇంధన ఆదాతో రూ. 8,720 కోట్లు మిగిలాయన్నారు.ప్రతి రైలులో వృద్ధులు, మహిళల కోసం 120 లోయర్ బెర్తులు ఏర్పాటు చేస్తామన్నారు. పీపీపీ విధానంలో 400 స్టేషన్ల ఆధునీకరణ చేస్తామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రైల్వేల ఆధునీకరణకు రూ.8.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. పారదర్శకతను పెంచేందుకు సామాజిక మాధ్యమం వినియోగంలోకి తెస్తామన్నారు. రైలు ప్రమాదాల నివారణకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తామన్నారు. 311 రైల్వే స్టేషన్లలో పూర్తిగా సీసీ కెమెరాలు అమర్చాం. దశలవారీగా అన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు అమర్చుతాం. గతేడాదితో పోల్చితే ప్రమాదాలు 20 శాతం తగ్గించగలిగామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







