మినిస్ట్రి, ప్రభుత్వ ఆఫీసులకు సందర్శకుల సంఖ్యను కుదించిన ఖతార్
- February 06, 2021
దోహా:కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన ఖతార్..లేటెస్ట్ గా మరో నిర్ణయం తీసుకుంది. వివిధ పనుల నిమిత్తం మంత్రుల కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సందర్శకుల సంఖ్యను కుదించింది. గతంలో కంటే కేవలం 30 శాతం మందికే అనుమతి ఉంటుందని స్పష్టత ఇచ్చింది. కొద్ది రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం..సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలన్ని ఆంక్షలను కఠినతరం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఖతార్ కు మంత్రులు, ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే వారి సంఖ్యపై పరిమితి విధించింది. అయితే..దరఖాస్తులు, ఇతర సేవలను పొందాలనుకునే వారు హాట్ లైన్ 16008కి కాల్ చేసి తగిన వివరాలను పొందవచ్చని వెల్లడించింది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు, సేవలు పొందగలిగే పనులకు సంబంధించి సందర్శకులను అనుమతించబోమని కూడా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!
- కోరల్ రిఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎన్విరాన్ మెంట్ అథారిటీ..!!
- 2,818 ఆయుధాలు అప్పగించిన కువైటీలు..!!









