రియాద్ లో ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించనున్న 24 ఇంటర్నేషనల్ కంపెనీలు
- February 06, 2021
రియాద్:అంతర్జాతీయ కంపెనీలను తమ వైపు ఆకర్షించాలన్న సౌదీ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. సౌదీ రాజధాని రియాద్ లో తమ ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఏకంగా 24 అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు సౌదీ అధికార యంత్రాంగంతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాయి. రియాద్ లో ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించనున్న ఇంటర్నేషనల్ కంపెనీల్లో పెప్సికో, టిమ్ హోర్టన్స్, బెచ్టెల్, బాష్, బోస్టన్ సైంటిఫిక్ వంటి మేటి సంస్థలు కూడా ఉన్నాయి. 2030 నాటికి ప్రపంచంలోని తొలి పది వాణిజ్య నగరాల్లో రియాద్ కు కూడా చోటు దక్కాలన్నది కింగ్డమ్ ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగానే అంతర్జాతీయ కంపెనీల కార్యాలయాల ఏర్పాటుకు సౌదీ సాదరంగా అహ్వానం పలుకుతోంది. ప్రస్తుత ఒప్పందం మేరకు 24 సంస్థల ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు ద్వారా జీతాలు, ఆఫీస్ నిర్వాహణ, మూలధన వ్యయం తరహా నిధులతో నేషనల్ ఎకనామికి 70 మిలియన్ల రియాల్స్ నిధులు సమకూరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్.. ముడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!
- కోరల్ రిఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎన్విరాన్ మెంట్ అథారిటీ..!!
- 2,818 ఆయుధాలు అప్పగించిన కువైటీలు..!!
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు









