సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన..
- February 07, 2021
హైదరాబాద్:తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. ఏప్రిల్లో 6 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఏ జిల్లా వాళ్ళు ముందుకు వస్తే అక్కడే సభ నిర్వహిద్దామని సమావేశంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతి ఎమ్మెల్యే 50 వేలమందితో సభ్యత్వం నమోదు చేయించాలని సూచించారు. ఈ నెల 12 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో కేటీఆర్ సీఎం అవుతారన్న ఊహాగానాలకు కూడా కేసీఆర్ తెరదించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. 10 ఏళ్ల సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. కేటీఆర్ సీఎం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని.. గీత దాటి మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని నాయకులను హెచ్చరించారు. మరోవైపు ఖమ్మం,వరంగల్, నల్గొండ గ్రాడ్యువేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని కన్ఫామ్ చేశారు ముఖ్యమంత్రి.
ఇక మార్చి 1వ తేదీ నుంచి పార్టీ కమిటీల నియామకం ఉంటుందని చెప్పారు. ఈ నెల 11న మేయర్ ఎన్నికలకు ఎక్స్అఫీషియో సభ్యులు కార్పోరేటర్లతో కలిసి జీహెచ్ఎంసీ వెళ్లాలని సూచించారు. సీల్డ్ కవర్లో మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లు ఉంటాయని చెప్పారు. జీహెచ్ఎంసీలో సీల్ కవర్ ఓపెన్ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు రెండు నెలలపాటు ప్రతి జిల్లాలో తిరుగుతానని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







