వ్యాక్సిన్ తీసుకున్న వారికే ప్రభుత్వ ఆఫీసుల్లోకి అనుమతి..
- February 07, 2021
రస్ అల్ ఖైమా:కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు రస్ అల్ ఖైమా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ సేవల కోసం ప్రభుత్వ ఆఫీసులను సందర్శించే వినియోగదారులు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతి ఉంటుందని ప్రకటించింది. కోవిడ్ కట్టడి కోసం చేపడుతున్న పలు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కనీసం రెండు వారాల ముందు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొన్న వారికి మాత్రమే ప్రభుత్వ ఆఫీసులలోకి అనుమతి ఉంటుందని వెల్లడించింది. సోమవారం నుంచే ఈ నిబంధన అమలులోకి రానుంది. అలాగే పలు సేవల కోసం వెళ్లే వినియోగదారులు అంతా..విధిగా ఫేస్ మాస్క్ ధరించటంతో పాటు భౌతిక దూరం పాటించాలని...టెంపరేచర్ చెకప్ చేసిన తర్వాతే ఆఫీసులోకి ఎంటర్ అవ్వాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









