వ్యాక్సిన్ తీసుకున్న వారికే ప్రభుత్వ ఆఫీసుల్లోకి అనుమతి..
- February 07, 2021
రస్ అల్ ఖైమా:కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు రస్ అల్ ఖైమా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ సేవల కోసం ప్రభుత్వ ఆఫీసులను సందర్శించే వినియోగదారులు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతి ఉంటుందని ప్రకటించింది. కోవిడ్ కట్టడి కోసం చేపడుతున్న పలు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కనీసం రెండు వారాల ముందు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొన్న వారికి మాత్రమే ప్రభుత్వ ఆఫీసులలోకి అనుమతి ఉంటుందని వెల్లడించింది. సోమవారం నుంచే ఈ నిబంధన అమలులోకి రానుంది. అలాగే పలు సేవల కోసం వెళ్లే వినియోగదారులు అంతా..విధిగా ఫేస్ మాస్క్ ధరించటంతో పాటు భౌతిక దూరం పాటించాలని...టెంపరేచర్ చెకప్ చేసిన తర్వాతే ఆఫీసులోకి ఎంటర్ అవ్వాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







