అదుపు తప్పిన తూటాకు భారతీయ కార్మికుడు బలి మరో ముగ్గురు భారతీయలకు గాయాలు
- February 25, 2016
తీవ్రవాదిపై తూటా పేలిస్తే...బతుకుతెరువు కోసం పొట్ట చేత్తో పట్టుకొని ఎడారి దేశాలకు వెళ్ళిన ఓ కార్మికుడిని తాకి అతని ప్రాణాలను బాలి తీసుకొంది. ఆ కరుణ లేని కటిన తూటాలు మరో ముగ్గురు సహచర భారతీయ కార్మికులను గాయపర్చాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వార్తకు సంబంధించి స్థానిక భారతీయులు తెలిపిన వివరాలలోనికి వెళితే, అవామియా పట్టణ శివార్లలోని ఒక వ్యవసాయ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం బహెరిన్ కు చెందిన అలీ మొహ్మౌద్ అల్ అబ్దుల్లహ్ అనే తీవ్రవాదిని పట్టుకొనేందుకు సౌదీ అరేబియా పోలీసులు అక్కడకు చేరుకొన్నారు, వీరి రాకను గమనించిన ఆ తీవ్రవాది సౌదీ భద్రత వ్యవస్థ దళంపై కాల్పులు జరపగా అందుకు ప్రతిస్పందిస్తూ సౌదీ పోలీసులు ఆ తీవ్రవాదిపై తూటాల వర్షం కురిపించి హతమార్చారు. ఈ ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో ఇక ఇంటి గదిలో నల్గురు భారతీయ కార్మికులు నివసిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనలో కొన్ని తూటాలు వీరి నివసిస్తున్న ఇంటివైపు దూసుకువచ్చాయి. కొన్ని తూటాలు ఒక కార్మికుడి ప్రాణం తీయగా, సహచర ముగ్గురు కార్మికులను గాయపర్చాయి. వీరిలో ఒకరకి తూటా భుజం లోనికి దిగబడింది. కాగా, సౌదీ అంతర్గత మంత్రిత్వశాఖ జనరల్ మన్సౌర్ అల్ తుర్కి రియాద్ ఎ.ఎఫ్.పి. తో మాట్లాడుతూ, తాము తీవ్రవాదిని మాత్రమె చంపినట్లు ఈ సంఘటనలో మరెవరు మరణించలేదని తెలియచేసారు. అయెతే, ఆసుపత్రి వర్గాల కధనం ప్రకారం బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బుల్లెట్ దిగి మృతి చెందిన ఒక కార్మికుడిని మరో ముగ్గురు భారతీయ కార్మికులను కొందరు వైద్యం నిమిత్తం తీసుకువచ్చారని గాయపడిన వారికి చికిత్స చేసినట్లు తెలియచేస్తున్నారు. ఇది సౌదీ భద్రత వ్యవస్థ తీవ్రవాద ఏరివేత అనంతరం వీరిని ఆసుపత్రి తిసుకోనివచ్చినట్లు వైద్య సిబ్బంది వివరిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







