27 రోజుల్లో 9,271 మంది ప్రవాసీయుల వర్క్ పర్లిట్లు రద్దు చేసిన కువైట్
- February 09, 2021
కువైట్ సిటీ :ప్రవాస కార్మికులకు షాక్ ఇచ్చింది కువైట్ ప్రభుత్వం. కేవలం 27 రోజుల వ్యవధిలో ఏకంగా 9,271 మంది ప్రవాసీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేసింది. అదే సమయంలో 362 మందికి కొత్తగా వర్క్ పర్మిట్లను జారీ చేసినట్లు మానవ వనరుల అధికార విభాగం తమ తాజా గణాంకాల్లో వెల్లడించింది. రద్దు చేసిన వర్క్ పర్మిట్లలో 4999 మంది ప్రస్తుతం కువైట్లో లేరని తెలిపింది. అయితే..అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలతో వాళ్లంత ఇతర దేశాల్లో చిక్కుకుపోయి కువైట్ రాలేదు. అలా విదేశాల్లో ఉండిపోయి..రెసిడెన్సీ వీసాల గడువు ముగిసిన వారి వర్క్ పర్మిట్లు రద్దు చేసినట్లు వివరించింది. 555 మంది వలస కార్మికులు మృతి చెందారని, దేశం విడిచి వెళ్లిన 3,534 మంది వలస కార్మికులు వర్క్ పర్మిట్లను రద్దు చేసినట్లు తెలిపారు. మరో 183 మంది తమ వీసాలను ఫ్యామిలీ వీసాలుగా బదిలీ చేసుకున్నట్లు మానవ వనరుల శాఖ వివరించింది. ఇదిలాఉంటే..గత నెల 24 నుంచి కొత్త వర్క్ పర్మిట్లను జారీ చేయటం ప్రారంభించిన కువైట్ ఇప్పటివరకు 362 మంది పర్మిట్లను జారీ చేసిందని..అయితే, అవన్ని మంత్రి మండలి ఆమోదం తర్వాతే అనుమతించినవని ప్రకటించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









