27 రోజుల్లో 9,271 మంది ప్రవాసీయుల వర్క్ పర్లిట్లు రద్దు చేసిన కువైట్
- February 09, 2021
కువైట్ సిటీ :ప్రవాస కార్మికులకు షాక్ ఇచ్చింది కువైట్ ప్రభుత్వం. కేవలం 27 రోజుల వ్యవధిలో ఏకంగా 9,271 మంది ప్రవాసీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేసింది. అదే సమయంలో 362 మందికి కొత్తగా వర్క్ పర్మిట్లను జారీ చేసినట్లు మానవ వనరుల అధికార విభాగం తమ తాజా గణాంకాల్లో వెల్లడించింది. రద్దు చేసిన వర్క్ పర్మిట్లలో 4999 మంది ప్రస్తుతం కువైట్లో లేరని తెలిపింది. అయితే..అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలతో వాళ్లంత ఇతర దేశాల్లో చిక్కుకుపోయి కువైట్ రాలేదు. అలా విదేశాల్లో ఉండిపోయి..రెసిడెన్సీ వీసాల గడువు ముగిసిన వారి వర్క్ పర్మిట్లు రద్దు చేసినట్లు వివరించింది. 555 మంది వలస కార్మికులు మృతి చెందారని, దేశం విడిచి వెళ్లిన 3,534 మంది వలస కార్మికులు వర్క్ పర్మిట్లను రద్దు చేసినట్లు తెలిపారు. మరో 183 మంది తమ వీసాలను ఫ్యామిలీ వీసాలుగా బదిలీ చేసుకున్నట్లు మానవ వనరుల శాఖ వివరించింది. ఇదిలాఉంటే..గత నెల 24 నుంచి కొత్త వర్క్ పర్మిట్లను జారీ చేయటం ప్రారంభించిన కువైట్ ఇప్పటివరకు 362 మంది పర్మిట్లను జారీ చేసిందని..అయితే, అవన్ని మంత్రి మండలి ఆమోదం తర్వాతే అనుమతించినవని ప్రకటించింది.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







