27 రోజుల్లో 9,271 మంది ప్రవాసీయుల వర్క్ పర్లిట్లు రద్దు చేసిన కువైట్
- February 09, 2021
కువైట్ సిటీ :ప్రవాస కార్మికులకు షాక్ ఇచ్చింది కువైట్ ప్రభుత్వం. కేవలం 27 రోజుల వ్యవధిలో ఏకంగా 9,271 మంది ప్రవాసీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేసింది. అదే సమయంలో 362 మందికి కొత్తగా వర్క్ పర్మిట్లను జారీ చేసినట్లు మానవ వనరుల అధికార విభాగం తమ తాజా గణాంకాల్లో వెల్లడించింది. రద్దు చేసిన వర్క్ పర్మిట్లలో 4999 మంది ప్రస్తుతం కువైట్లో లేరని తెలిపింది. అయితే..అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలతో వాళ్లంత ఇతర దేశాల్లో చిక్కుకుపోయి కువైట్ రాలేదు. అలా విదేశాల్లో ఉండిపోయి..రెసిడెన్సీ వీసాల గడువు ముగిసిన వారి వర్క్ పర్మిట్లు రద్దు చేసినట్లు వివరించింది. 555 మంది వలస కార్మికులు మృతి చెందారని, దేశం విడిచి వెళ్లిన 3,534 మంది వలస కార్మికులు వర్క్ పర్మిట్లను రద్దు చేసినట్లు తెలిపారు. మరో 183 మంది తమ వీసాలను ఫ్యామిలీ వీసాలుగా బదిలీ చేసుకున్నట్లు మానవ వనరుల శాఖ వివరించింది. ఇదిలాఉంటే..గత నెల 24 నుంచి కొత్త వర్క్ పర్మిట్లను జారీ చేయటం ప్రారంభించిన కువైట్ ఇప్పటివరకు 362 మంది పర్మిట్లను జారీ చేసిందని..అయితే, అవన్ని మంత్రి మండలి ఆమోదం తర్వాతే అనుమతించినవని ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









