ఒమన్ : 24 గంటల్లోనే 2000 మందికి వ్యాక్సినేషన్
- February 09, 2021
మస్కట్:ఒమన్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేస్తోంది. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం ప్రాధాన్య వర్గాల క్రమంలో వ్యాక్సిన్ అందిస్తుంది.
తొలుత ఫైజర్ వ్యాక్సిన్ వేసిన ఒమన్..దేశ ప్రజలు అందరికీ వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో భారత ఉత్పతి వ్యాక్సిన్ అస్ట్రాజెనెకాను కూడా అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసింది. గత 24 గంటల్లో సుల్తానేట్ లో 2 వేలకు పైగా ప్రజలకు ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ టీకాలు వేయించారు. ఇది నిర్దేశించుకున్న సంఖ్యలో3 శాతం. ఇక గవర్నరేట్ల వారీగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 875 మందికి వ్యాక్సిన్ వేసి మస్కట్ గవర్నరేట్ తొలి స్థానంలో ఉంది. 315 మందికి టీకాలతో నార్త్ అల్ బటినా గవర్నరేట్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుస క్రమంలో అల్-దఖిలియా గవర్నరేట్ 267, అల్-ధహిరా గవర్నరేట్ 176, నార్త్ అల్ షార్కియా గవర్నరేట్ 133, అల్ షార్కియా సౌత్ గవర్నరేట్ 132, ధోఫర్ గవర్నరేట్ 36, అల్-బురైమి పరిధిలో 34 మందికి వ్యాక్సిన్ వేశారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









