గల్ఫ్ వెళ్తున్నారా? జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్న కమీషనర్ మహేష్ భగవత్
- February 09, 2021
హైదరాబాద్:గల్ఫ్ దేశాలకు తెలంగాణ,ఏపీ రాష్ట్రాల నుండి చాలా మంది పని కోసం వెళ్తున్నారని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. గ్రామాల్లో కొంతమంది ఏజెన్సీలుగా ఏర్పడి మహిళలను ఇతర దేశాలకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.విజిట్ వీసా మీద ఇతర దేశాలకు పంపిస్తారు..విజిట్ వీసా అయిపోయిన తర్వాత వారిని జైల్లో పెట్టి అనంతరం వారిని విడిపించి వ్యబిచార గృహాలకు తరలిస్తున్నారని తెలిపారు.మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఖాదర్ బి అనే మహిళను ఒమన్ దేశానికి వెళ్ళడానికి సిద్ధం చేశారు.
ఒమన్ దేశానికి వెళ్లాలంటే ఏజెంట్ తో ఒకరు గడపాలని షరతులు పెట్టారు..దింతో అనుమానం వచ్చిన మహిళ పోలీసులకు సమాచారం అందించింది.. వారిపై దాడి చేసి ముఠా ను అరెస్ట్ చేసాం..ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసాం..మరో ముగ్గురు నిందితులు పరారీ లో ఉన్నారు..నిందితుల వద్ద నుండి 40 ఇండియా పాస్ పోర్టులు, 4 మొబైల్ ఫోన్స్, 6 వేల నగదు స్వాధీనం చేసుకున్నాము.
నిందితులందరు కడప,హైదరాబాద్ కు చెందిన వారు.తెలంగాణ,ఏపీ రాష్టాల నుండి మహిళల ను ట్రాప్ చేసి వారికి డబ్బు ఆశ చూపించి ఇతర దేశాల్లో ఉండే వారికి అమ్ముతారు. అరబ్ దేశాలకు ఎక్కువగా మహిళలు అమ్ముతారు..ఇతర దేశాలకు పంపిస్తామని ఏజెంట్లు ఎవ్వరైనా వచ్చి ఇబ్బందులు పెడితే మాకు సమాచారం అందించాలని మహేష్ భగవత్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్