కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్

- February 09, 2021 , by Maagulf
కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న సైబరాబాద్  సీపీ వీసీ సజ్జనార్

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ రెండో విడత కొనసాగుతుంది. ఇందులో భాగంగా పోలీసు శిక్షణా కేంద్రంలో హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్ ‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. క‌రోనా టీకా సుర‌క్షిత‌మ‌ని సీపీ వీసీ సజ్జనార్ కుమార్ అన్నారు. ఇటీవ‌లే రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్,హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ‌తో పాటు ప‌లువురు క‌రోనా టీకా తీసుకున్న విష‌యం తెలిసిందే.

రాష్ట్రంలో రెండో దశ కరోనా టీకా పంపిణి ఫిబ్రవరి 6న ప్రారంభమయ్యింది. ఇందులో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు అయిన పోలీసు, మున్సిపల్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల సిబ్బందికి కరోనా టీకా పంపిణీ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com