రెండు వారాలపాటు మసీదుల్లో ప్రార్థనల రద్దు

- February 10, 2021 , by Maagulf
రెండు వారాలపాటు మసీదుల్లో ప్రార్థనల రద్దు

మనామా:ప్రార్ధనలు అలాగే మత సంబంధమైన కార్యక్రమాల్ని మసీదుల్లో రెండు వారాల పాటు రద్దు చేస్తూ బహ్రెయిన్ నిర్ణయం తీసుకుంది.శుక్రవారం ప్రార్థనలు అలాగే సెర్మాన్ వంటివి అహ్మద్ అల్ ఫతెహ్ ఇస్లామిక్ సెంటర్ ద్వారా (తక్కువమందితో) ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్స్ ఈ రెండు వారాల రద్దు నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రకమంలో సుప్రీం కౌన్సిల్ ఫర్ ఇస్లామిక్ ఎఫైర్స్ అలాగే కోవిడ్ 19 మెడికల్ టాస్క్ ఫోర్స్ సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.సున్నీ అలాగే జఫ్ఫెరి ఎండోమెంట్స్ డైరెక్టరేట్స్ ఈ నిర్ణయాల అమలును సమీక్షిస్తాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com