షార్జాలోని ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం
- February 10, 2021
షార్జా:ఇటీవలి కాలంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో షార్జా పాలన యంత్రాంగం మరిన్ని ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. యూఏఈ ఫెడరల్ గవర్నమెంట్ నిర్ణయాలకు అనుగుణంగా ఇప్పటికే రెస్టారెంట్లు, కేఫ్ లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో కస్టమర్ల సంఖ్యపై పరిమితులు విధించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఎమిరాతి పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రతి వారం తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని షార్జా అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నమెంట్ ఆఫీసులలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సిబ్బందిలో అవకాశం ఉన్న వాళ్లంతా ఇంటి నుంచే పని చేసుకునేలా వెసులుబాటు కలిపించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలును పర్యవేక్షించనున్నారు. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరని డిపార్ట్మెంట్లలో షిఫ్ట్ ల వారీగా ఉద్యోగులు విధుల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి షిఫ్ట్ లో ఆఫీసుకు హజరయ్యే ఉద్యోగుల సంఖ్య 50 శాతానికి మించకూడదని సూచించింది. అంతేకాదు..ప్రతి ఉద్యోగి డెస్క్ ఇతర ఉద్యోగికి రెండు మీటర్ల దూరంలో ఉండేలా ఏర్పాటు చేయాలని షార్జా పాలనా యంత్రాంగం ఆదేశించింది.
తాజా వార్తలు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
- తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!
- పౌల్ట్రీ ఉత్పత్తుల ఆందోళనపై సౌదీ అరేబియా క్లారిటీ..!!









