షార్జాలోని ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం
- February 10, 2021_1612972452.jpg)
షార్జా:ఇటీవలి కాలంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో షార్జా పాలన యంత్రాంగం మరిన్ని ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. యూఏఈ ఫెడరల్ గవర్నమెంట్ నిర్ణయాలకు అనుగుణంగా ఇప్పటికే రెస్టారెంట్లు, కేఫ్ లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో కస్టమర్ల సంఖ్యపై పరిమితులు విధించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఎమిరాతి పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రతి వారం తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని షార్జా అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నమెంట్ ఆఫీసులలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సిబ్బందిలో అవకాశం ఉన్న వాళ్లంతా ఇంటి నుంచే పని చేసుకునేలా వెసులుబాటు కలిపించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలును పర్యవేక్షించనున్నారు. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరని డిపార్ట్మెంట్లలో షిఫ్ట్ ల వారీగా ఉద్యోగులు విధుల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి షిఫ్ట్ లో ఆఫీసుకు హజరయ్యే ఉద్యోగుల సంఖ్య 50 శాతానికి మించకూడదని సూచించింది. అంతేకాదు..ప్రతి ఉద్యోగి డెస్క్ ఇతర ఉద్యోగికి రెండు మీటర్ల దూరంలో ఉండేలా ఏర్పాటు చేయాలని షార్జా పాలనా యంత్రాంగం ఆదేశించింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!