వాహనదారుల భద్రతే ప్రమాణంగా రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టిన సౌదీ
- February 10, 2021
సౌదీ:వాహనదారుల భద్రత, రద్దీకి సరిపడేలా ఈజీ ఫ్లోటింగ్ కు అనువుగా రోడ్లను అభివృద్ధి చేసేందుకు సౌదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రవాణా శాఖ మంత్రి వెల్లడించారు. గత నెలలో కింగ్డమ్ వ్యాప్తంగా చేపట్టిన పలు రహదారి అభివృద్ధి పనులను వివరించారు. మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శాస్త్రీయ అధ్యయనం,సర్వేలు చేసిన తర్వాత అవసరమైన ప్రాంతాల్లో అత్యున్నత ప్రమాణాలతో రహదారుల అభివృద్ధి చేపట్టినట్లు వెల్లడించారు.సర్వేల సూచనల మేరకు దేశంలోని పలు ప్రాంతాల్లో మొత్తం 189 కిలోమీటర్ల మేర మరమ్మతు పనులు నిర్వహించామని, ఐదు చోట్ల ఇంటర్ సెక్షన్ పనులను పూర్తి చేశామని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే వర్షాకాలంలో ముంపునకు గురయ్యే అవకాశాలున్న లోతట్టు ప్రాంతాలు, లోయ ప్రాంతాలను కూడా కమ్యూనికేట్ చేసేలా క్లినింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు..17 బ్రిడ్జిలకు అవసరమైన నిర్వహణ పనులను పూర్తి చేస్తున్నట్లు ప్రకటించింది.అంతేకాదు..దేశవ్యాప్తంగా 4,652 కిలోమీటర్ల మేర మురికి రోడ్ల సర్వే పూర్తయిందని...అవసరమైన చోట తగిన నిర్వహణ చర్యలు చేపడుతామని తెలిపింది.వాహనదారుల భ్రదతకు కింగ్డమ్ లోని రహదారుల నిర్మాణంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తామని రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







