వాహనదారుల భద్రతే ప్రమాణంగా రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టిన సౌదీ
- February 10, 2021
సౌదీ:వాహనదారుల భద్రత, రద్దీకి సరిపడేలా ఈజీ ఫ్లోటింగ్ కు అనువుగా రోడ్లను అభివృద్ధి చేసేందుకు సౌదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రవాణా శాఖ మంత్రి వెల్లడించారు. గత నెలలో కింగ్డమ్ వ్యాప్తంగా చేపట్టిన పలు రహదారి అభివృద్ధి పనులను వివరించారు. మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శాస్త్రీయ అధ్యయనం,సర్వేలు చేసిన తర్వాత అవసరమైన ప్రాంతాల్లో అత్యున్నత ప్రమాణాలతో రహదారుల అభివృద్ధి చేపట్టినట్లు వెల్లడించారు.సర్వేల సూచనల మేరకు దేశంలోని పలు ప్రాంతాల్లో మొత్తం 189 కిలోమీటర్ల మేర మరమ్మతు పనులు నిర్వహించామని, ఐదు చోట్ల ఇంటర్ సెక్షన్ పనులను పూర్తి చేశామని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే వర్షాకాలంలో ముంపునకు గురయ్యే అవకాశాలున్న లోతట్టు ప్రాంతాలు, లోయ ప్రాంతాలను కూడా కమ్యూనికేట్ చేసేలా క్లినింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు..17 బ్రిడ్జిలకు అవసరమైన నిర్వహణ పనులను పూర్తి చేస్తున్నట్లు ప్రకటించింది.అంతేకాదు..దేశవ్యాప్తంగా 4,652 కిలోమీటర్ల మేర మురికి రోడ్ల సర్వే పూర్తయిందని...అవసరమైన చోట తగిన నిర్వహణ చర్యలు చేపడుతామని తెలిపింది.వాహనదారుల భ్రదతకు కింగ్డమ్ లోని రహదారుల నిర్మాణంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తామని రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
- తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!









