వీకెండ్ లో పెరగనున్న చలి తీవ్రత..ఖతార్ వాతావరణ శాఖ వెల్లడి
- February 11, 2021
దోహా:ఖతార్ లో రానున్న రెండ్రోజులు చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతాయని, రాత్రిళ్లు శీతల వాతావరణం ఉండే అవకాశాలే ఎక్కువని అంచనాగా చెప్పుకోచ్చింది. అయితే పగటి వేళల్లో మాత్రం మేఘాలతో కూడిన వాతావరణం ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా పరిమితంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగాను, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గాను నమోదవుతాయన్నారు. దుమ్ముతో కూడిన గాలి తీవ్రత కూడా ఉంటుందని, గాలి తీవ్రతకు వాయువ్య దిశలో సముద్రంలో ఆటుపోటులు కనిపిస్తాయన్నారు. శుక్రవారం సముద్ర ఆలలు సాధారణ రోజుల కంటే 8 అడుగులు ఎక్కువగా వస్తాయని, శనివారం రోజున అలలు 6 అడుగుల ఎత్తులో వస్తాయన్నారు. ఈ వారంతంలో దృశ్య సంభావ్యత 4 కిలో మీటర్లుగా ఉండొచ్చని వివరించారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







