వీకెండ్ లో పెరగనున్న చలి తీవ్రత..ఖతార్ వాతావరణ శాఖ వెల్లడి
- February 11, 2021
దోహా:ఖతార్ లో రానున్న రెండ్రోజులు చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతాయని, రాత్రిళ్లు శీతల వాతావరణం ఉండే అవకాశాలే ఎక్కువని అంచనాగా చెప్పుకోచ్చింది. అయితే పగటి వేళల్లో మాత్రం మేఘాలతో కూడిన వాతావరణం ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా పరిమితంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగాను, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గాను నమోదవుతాయన్నారు. దుమ్ముతో కూడిన గాలి తీవ్రత కూడా ఉంటుందని, గాలి తీవ్రతకు వాయువ్య దిశలో సముద్రంలో ఆటుపోటులు కనిపిస్తాయన్నారు. శుక్రవారం సముద్ర ఆలలు సాధారణ రోజుల కంటే 8 అడుగులు ఎక్కువగా వస్తాయని, శనివారం రోజున అలలు 6 అడుగుల ఎత్తులో వస్తాయన్నారు. ఈ వారంతంలో దృశ్య సంభావ్యత 4 కిలో మీటర్లుగా ఉండొచ్చని వివరించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







