పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు...

- February 25, 2016 , by Maagulf
పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు...

మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో గురువారం భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. చెల్లెపాడు సర్పంచ్ నరసింహా, బెక్కెం సర్పంచ్ అళివేళ కురుమయ్యతోపాటు టీడీపీకి చెందిన సోమశీల గ్రామ సర్పంచ్ కేతూరి వెంకటస్వామి, ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ, ఆమె భర్త బాలరాజు, ఉప సర్పంచ్ లక్ష్మిలు టీఆర్‌ఎస్‌లో చేరినవారిలో ఉన్నారు. సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలంలో పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జిందం చక్రపాణీ, సెస్ చైర్మన్ అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
చేరినవారిలో కాంగ్రెస్ నేత గజబింకార్ రాజన్న, కాంగ్రెస్ కౌన్సిలర్లు కొండ అనూష శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com