కోవిడ్ టీకా వేస్తానని మత్తు మందిచ్చిన నర్స్..

- February 14, 2021 , by Maagulf
కోవిడ్ టీకా వేస్తానని మత్తు మందిచ్చిన నర్స్..

హైదరాబాద్:హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ నర్స్.. కరోనా వాక్సిన్ పేరుతో వృద్ధ దంపతులను మోసం చేసింది. మీర్ పేట్ పరిధిలోని లలితానరగ్ లో కరోనా వ్యాక్సిన్ అంటూ మత్తు మందు ఇచ్చింది. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ఒంటిపై ఉన్న ఎనిమిది తులాల బంగారం అపహరించుకుపోయింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితురాలిని అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకు ముందు కూడా వృద్ధదంపతులకు పాయసంలో మత్తు మందు కలిపి ఇచ్చింది. అయితే వారికి షుగర్ ఉండడంతో దానిని తినలేదు. దీంతో కరోనా వ్యాక్సిన్ అంటూ స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com