20 నిమిషాల్లోనే వ్యాక్సినేషన్..యూఏఈలో డ్రైవ్ థ్రూ సెంటర్స్ ఏర్పాటు
- February 16, 2021_1613454289.jpg)
యూఏఈ:కోవిడ్ వ్యాక్సిన్ ను వీలైనంత తొందరగా కింగ్డమ్ ప్రజలందరికీ అందించేలా కసరత్తు చేస్తోంది యూఏఈ. ఇందులో భాగంగా అబుధాబిలో డ్రైవ్ థ్రూ వ్యాక్సినేషన్ సెంటర్లను ప్రారంభించింది.ఎమిరేట్స్ పరిధిలో ఏర్పాటైన డ్రైవ్ థ్రూ వ్యాక్సినేషన్ ద్వారా కార్లలోనే వచ్చి..వ్యాక్సిన్ తీసుకొని వెళ్లిపోవచ్చు.వ్యాక్సిన్ వేసుకునేందుకు అవసరమైన ఆరోగ్య అర్హతలను పరిశీలించి 20 నిమిషాల్లోనే వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయటం ఈ కేంద్రాల ప్రత్యేకత. అంతేకాదు..ఒక రోజులోనే 700 మంది, ప్రతి గంటకు 60 మంది చొప్పున వ్యాక్సిన్ ఇచ్చేలా డ్రైవ్ థ్రూ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు.ఈ కేంద్రాల ద్వారా కింగ్డమ్ పరిధిలో వ్యాక్సినేషన్ ను మరింత ముమ్మరం చేయటం..ముఖ్యంగా వృద్ధులకు,దీర్ఘకాలిక రోగులకు త్వరతగతిన వ్యాక్సిన్ అందించేందుకు అస్కారం ఏర్పడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటివరకు 5 మిలియన్ల డోసులను వేశామని..ఇదంతా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బంది చిత్తశుద్ధి వల్లే సాధ్యమైందని అబుధాబి ఆరోగ్య శాఖ చైర్మన్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!