చెన్నై టెస్టులో ఇంగ్లాండ్ పై భారత్‌ ఘన విజయం

- February 16, 2021 , by Maagulf
చెన్నై టెస్టులో ఇంగ్లాండ్ పై భారత్‌ ఘన విజయం

చెన్నై:నాలుగు టెస్ట్ మ్యాచ్‌‌ సిరీస్‌లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.ఇంగ్లాండ్ పై 317 పరుగుల తేడాతో భారత్‌ విజయకేతనం ఎగురవేసింది.టీమిండియా స్పిన్నర్ల ధాటికి విలవిలలాడిన ఇంగ్లండ్‌... రెండో ఇన్నింగ్స్ లో 164 పరుగులకే ఆలౌట్ అయింది.ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌.ఏకంగా 5 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను ఘోరంగా దెబ్బ తీశాడు అక్షర్‌ పటేల్‌. అటు అశ్విన్‌ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. కాగా.. మొదటి ఇన్నింగ్స్‌లో టీం ఇండియా 329 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌట్‌ అయింది.ఇక ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌట్‌ అయి.. ఓటమి చవి చూసింది.4 టెస్టుల సిరీస్‌లో చెరో మ్యాచ్‌ గెలిచిన భారత్‌, ఇంగ్లండ్‌.. 1-1తో సిరీస్‌ను సమం చేశాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com