కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 600 మందిపై కేసుల నమోదు

- February 16, 2021 , by Maagulf
కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 600 మందిపై కేసుల నమోదు

దోహా:కరోనా వ్యాప్తిని అరికట్టేందుకోసం అమల్లోకి తెచ్చిన నిబంధనల్ని ఉల్లంఘిస్తోన్నవారిపై ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోంది అధికార యంత్రాంగం.ఈ మేరకు అవసరమైన రీతిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.తాజాగా నిర్వహించిన తనిఖీల్లో అధికారులు 637 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది.వీరిలో 557 మంది మాస్కులు ధరించలేదని అధికారులు తెలిపారు.వాహనాల్లో పరిమతికి మించి ప్రయాణిస్తున్నవారికి సంబంధించి 59 కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు 13,426 మంది ఫేస్ మాస్కులకు సంబంధించిన ఉల్లంఘనకుగాను, 490 మంది పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణిస్తున్నందుకుగాను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగింది.సోషల్ డిస్టెన్సింగ్ పాటించని ఆరుగురు వ్యక్తుల్ని కూడా రిఫర్ చేశారు. మరో ఆరుగురు వ్యక్తులు హోం క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించారు. 9 మంది ఎహ్‌తెరాజ్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకోనందుకు బుక్కయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com