యూఏఈ కోవిడ్ వ్యాక్సినేషన్: 40 శాతం మందికి వ్యాక్సిన్
- February 17, 2021
యూఏఈ:యూఏఈ జనాభాలో 40 శాతం మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.వృద్ధుల్లో దాదాపు 50 శాతం మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందినట్లు అథారిటీస్ చెబుతున్నాయి. యూఏఈ హెల్త్ సెక్టార్ అధికార ప్రతినిథి డాక్టర్ ఫరీదా అల్ హోసాని మాట్లాడుతూ 48.6 శాతం వృద్ధులకు వ్యాక్సిన్ అందించినట్లు చెప్పారు.ఇది దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడానికి ఉపయోగపడుతుందని అన్నారు.వృద్ధులకు వ్యాక్సిన్ అందించడం ద్వారా కోవిడ్ వల్ల కలిగే తీవ్ర అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి వీలవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 16 నాటికి దేశంలో 5.19 మిలియన్ వ్యాక్సిన్ డోసుల్ని అందించినట్లు తెలుస్తోంది. ప్రతి 100 మందిలో 52.56 మందికి వ్యాక్సిన్ అందించినట్లయ్యింది. తొలి డోసు అందుకున్నవారందరికీ రెండో డోస్ కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నాయి అథారిటీస్.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







