భారత్ లో కరోనా కేసుల వివరాలు

- February 17, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కొంతమేర కంట్రోల్ అయ్యింది.అయితే, నిన్నటి బులెటిన్ ప్రకారం దేశంలో కేసులు 9వేలకు దిగువున నమోదుకాగా, ఈరోజు రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం కేసుల సంఖ్య పెరిగింది. దేశంలో కొత్తగా 11,610 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,37,320కి చేరింది.ఇందులో 1,06,44,858 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,36,549 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 100 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,55,913కి చేరింది.ఇక ఇదిలా ఉంటె దేశంలో ఇప్పటి వరకు 90 లక్షలకు పైగా కరోనా వ్యాక్సిన్ ను అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com