ఆర్థిక భరోసానిచ్చే పాలసీ..
- February 17, 2021
ప్రభుత్వ సంస్థ ప్రముఖ బీమా సంస్థ ఎల్ఐసీ..ఇది అత్యంత విశ్వసనీయ సంస్థ. అధిక సంఖ్యలో ప్రజలు పెట్టుబడి పెట్టడానికి ఇదే ప్రధాన కారణం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలను తీసుకువస్తూ ప్రజల ప్రయోజనార్థం పని చేస్తుంటుంది.ఈ సంస్థ తీసుకొచ్చిన పాలసీలలో జీవన్ ఆనంద్ పాలసీకి మంచి ప్రాచుర్యం లభించింది. పాలసీ గడువు ముగిసిన తరువాత కూడా బీమా కొనసాగడం ఈ పాలసీ ప్రత్యేకత. దీనిలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి కొత్తగా ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ అని ఒకటి తీసుకువచ్చింది ఎల్ఐసీ కొద్దినెలల క్రితం.
ఇక ఇందులో చేరేందుకు కనీస వయస్సు 18 నుంచి 50 ఏళ్లు ఉండాలి.కనీస బీమా లక్ష అంతకు మించి ఎంతైనా గరిష్ట పరిమితి లేదు.కాలపరిమితి 15 నుంచి 35 ఏళ్ల కాలం. ఉదాహరణకు పాలసీ దారుడు 35 ఏళ్ల వయసులో 5 లక్షలు పెట్టుబడి పెట్టి ఈ పాలసీ తీసుకున్నాడని అనుకుందాం.అప్పుడు అతడు నెలకు రూ.1650లు (అంటే రోజుకు రూ.55)చెల్లిస్తే సరిపోతుంది. మూడు నెలలకు ఒకసారి కట్టాలి అనుకుంటే రూ.5000, అదే ఆరు నెలలకు కట్టాలనుకుంటే రూ.10000 చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి కడతానంటే కూడా ఒకేసారి రూ.20000 చెల్లించొచ్చు. ఒకవేళ పాలసీ దారుడు గడువులోపే మరణిస్తే అప్పుడు నామినీకి రూ.5,00,000 లక్షలు చెల్లిస్తారు. ఈ విధంగా మొత్తం 25 సంవత్సరాలు పెట్టుబడి పెట్టిన తరువాత పాలసీదారునికి ఎస్ఐ రూపంలో రూ.5,00,000, బోనస్ కింద రూ.5,75000, చివరిగా అదనపు బోనస్ కింద రూ.2,25,000 లభిస్తాయి. ఈ విధంగా 60 ఏళ్ల వయసు వచ్చేసరికి పాలసీ దారునికి 1300000 అందుకున్నట్లవుతుంది.
మరిన్ని వివరాలకు ఈ నెంబర్ 00919949322175 కి కాల్ చెయ్యగలరు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







