ఆర్థిక భరోసానిచ్చే పాలసీ..
- February 17, 2021
ప్రభుత్వ సంస్థ ప్రముఖ బీమా సంస్థ ఎల్ఐసీ..ఇది అత్యంత విశ్వసనీయ సంస్థ. అధిక సంఖ్యలో ప్రజలు పెట్టుబడి పెట్టడానికి ఇదే ప్రధాన కారణం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలను తీసుకువస్తూ ప్రజల ప్రయోజనార్థం పని చేస్తుంటుంది.ఈ సంస్థ తీసుకొచ్చిన పాలసీలలో జీవన్ ఆనంద్ పాలసీకి మంచి ప్రాచుర్యం లభించింది. పాలసీ గడువు ముగిసిన తరువాత కూడా బీమా కొనసాగడం ఈ పాలసీ ప్రత్యేకత. దీనిలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి కొత్తగా ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ అని ఒకటి తీసుకువచ్చింది ఎల్ఐసీ కొద్దినెలల క్రితం.
ఇక ఇందులో చేరేందుకు కనీస వయస్సు 18 నుంచి 50 ఏళ్లు ఉండాలి.కనీస బీమా లక్ష అంతకు మించి ఎంతైనా గరిష్ట పరిమితి లేదు.కాలపరిమితి 15 నుంచి 35 ఏళ్ల కాలం. ఉదాహరణకు పాలసీ దారుడు 35 ఏళ్ల వయసులో 5 లక్షలు పెట్టుబడి పెట్టి ఈ పాలసీ తీసుకున్నాడని అనుకుందాం.అప్పుడు అతడు నెలకు రూ.1650లు (అంటే రోజుకు రూ.55)చెల్లిస్తే సరిపోతుంది. మూడు నెలలకు ఒకసారి కట్టాలి అనుకుంటే రూ.5000, అదే ఆరు నెలలకు కట్టాలనుకుంటే రూ.10000 చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి కడతానంటే కూడా ఒకేసారి రూ.20000 చెల్లించొచ్చు. ఒకవేళ పాలసీ దారుడు గడువులోపే మరణిస్తే అప్పుడు నామినీకి రూ.5,00,000 లక్షలు చెల్లిస్తారు. ఈ విధంగా మొత్తం 25 సంవత్సరాలు పెట్టుబడి పెట్టిన తరువాత పాలసీదారునికి ఎస్ఐ రూపంలో రూ.5,00,000, బోనస్ కింద రూ.5,75000, చివరిగా అదనపు బోనస్ కింద రూ.2,25,000 లభిస్తాయి. ఈ విధంగా 60 ఏళ్ల వయసు వచ్చేసరికి పాలసీ దారునికి 1300000 అందుకున్నట్లవుతుంది.
మరిన్ని వివరాలకు ఈ నెంబర్ 00919949322175 కి కాల్ చెయ్యగలరు.
తాజా వార్తలు
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







