సౌదీ న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న మహిళల సంఖ్య
- February 17, 2021
సౌదీ: మహిళా స్వాలంభన దిశగా సౌదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దేశ న్యాయ వ్యవస్థలో మహిళల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. జ్యూడిషియల్ సెక్టార్ లో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న వారి సంఖ్య గతేడాదిలో 1,814 మందికి పెరిగింది. ఇక లాయర్లుగా లైసెన్స్ పొందిన మహిళల సంఖ్య 2019లో 618గా ఉంటే... 2020లో 1,029కి పెరిగింది. అంటే ఏడాది కాలంలో ఏకంగా 66 శాతం పెరిగిందని న్యాయ మంత్రిత్వ శాఖలోని మహిళా విభాగం డైరెక్టరేట్ కార్యాలయం వివరించింది. జ్యూడిషియల్ సెక్టార్లోని లీగల్, సోషల్ రీసెర్చర్స్, అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్స్, ప్రోగ్రామ్ డెవలపర్స్ ఇలా పలు విభాగాల్లో 2020 నాటికి 30,500 మంది సేవలు అందిస్తున్నారని వివరించింది. వుమెన్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయటం వల్లే మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగేందుకు దోహదపడిందని, ఇటీవలె న్యాయ శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామని పేర్కొంది. లాయర్లుగా లైసెన్స్ పొందెందుకు ఈ శిక్షణ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని..ప్రస్తుతం 4,070 మంది ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతుండగా..అందులో 1,680 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. విజన్ 2030 లక్ష్యం మేరకు దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యిన్ని పెంపొందించే దిశగా కృషి చేస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫీస్ వివరించింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం