భారత్ టూ దుబాయ్ ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ కొత్త రూల్స్
- February 18, 2021
భారత్ నుంచి దుబాయ్ వెళ్లే ప్రయాణికులు ఇన్నాళ్లుగా పీసీఆర్ టెస్ట్ నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.ఇక నుంచి పీసీఆర్ టెస్ట్ ఒరిజినల్ రిపోర్ట్ యాక్సెస్ ఉండేలా క్యూఆర్ కోడ్ లింకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి ఇండియన్ క్యారియర్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ పీసీఆర్ టెస్ట్ రూల్స్ ను మారుస్తున్నట్లు ప్రకటించింది. క్యూఆర్ కోడ్ లింకింగ్ తో పాటు శాంపిల్స్ ఏ రోజు..ఏ సమయంలో ఇచ్చారు, రిపోర్టులు ఏ రోజు..ఏ సమయానికి వచ్చాయో కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది.దుబాయ్ ఆరోగ్య శాఖ నుంచి అందిన సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.ల్యాబోరేటరీల నుంచి ఫేక్ పీసీఆర్ టెస్ట్ రిపోర్టులతో ప్రయాణాలు చేస్తున్నారనే సందేహాలు వ్యక్తం చేసిన దుబాయ్ క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.అయితే..ఈ కొత్త పీసీఆర్ టెస్ట్ రూల్స్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో మాత్రం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ స్పష్టంగా పేర్కొలేదు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







