భారత్ టూ దుబాయ్ ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ కొత్త రూల్స్

- February 18, 2021 , by Maagulf
భారత్ టూ దుబాయ్ ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ కొత్త రూల్స్

భారత్ నుంచి దుబాయ్ వెళ్లే ప్రయాణికులు ఇన్నాళ్లుగా పీసీఆర్ టెస్ట్ నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.ఇక నుంచి పీసీఆర్ టెస్ట్ ఒరిజినల్ రిపోర్ట్ యాక్సెస్ ఉండేలా క్యూఆర్ కోడ్ లింకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి ఇండియన్ క్యారియర్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ పీసీఆర్ టెస్ట్ రూల్స్ ను మారుస్తున్నట్లు ప్రకటించింది. క్యూఆర్ కోడ్ లింకింగ్ తో పాటు శాంపిల్స్ ఏ రోజు..ఏ సమయంలో ఇచ్చారు, రిపోర్టులు ఏ రోజు..ఏ సమయానికి వచ్చాయో కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది.దుబాయ్ ఆరోగ్య శాఖ నుంచి అందిన సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.ల్యాబోరేటరీల నుంచి ఫేక్ పీసీఆర్ టెస్ట్ రిపోర్టులతో ప్రయాణాలు చేస్తున్నారనే సందేహాలు వ్యక్తం చేసిన దుబాయ్ క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.అయితే..ఈ కొత్త పీసీఆర్ టెస్ట్ రూల్స్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో మాత్రం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ స్పష్టంగా పేర్కొలేదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com