రాత పరీక్ష లేకుండా ఇండియన్ రైల్వేలో భారీగా ఉద్యోగాలు.!
- February 19, 2021వరుసగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఇండియన్ రైల్వేస్ తాజాగా మరోసారి భారీ సంఖ్యలో నియామకాలను చేపట్టింది. మొత్తం 2500లకు పైగా అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ రైల్వేలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నియామకాలను చేపట్టారు. అయితే ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండానే మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చ్ 5 వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఖాళీల వివరాలు..
ముంబాయిలోని వివిధ విభాగాల్లో 1767 పోస్టులను భర్తీ చేస్తున్నారు. భూసావల్ రైల్వే డివిజన్ పరిధిలో 420 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పూణేలో 152, షోలాపూర్ లో 79 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
అర్హతల వివరాలు..
అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ అర్హత సాధించి ఉండాలి. NCVT సర్టిఫికేట్ ను పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఐటీఐ, టెన్త్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
అధికారిక వెబ్సైట్:https://www.rrccr.com/
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు