ఏపీలో కరోనా కేసుల వివరాలు

- February 19, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి.నిన్నటి కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 67 కేసులు నమోదు కాగా, ఈరోజు ఆ సంఖ్య కాస్త పెరిగింది.ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 79 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,89,156  కి చేరింది.ఇందులో 8,81,369 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 620 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఒక్కరు మరణించారు.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,167  కి చేరింది.ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 77 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com