అబుధాబి: అత్యాచారయత్నం కేసులో ముగ్గురికి జీవిత ఖైదు విధించిన కోర్టు
- February 20, 2021
అబుధాబి:అత్యాచార యత్నం, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన కేసులో ముగ్గురు దోషులకు అబుధాబి క్రిమినల్ కోర్టు యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. కోర్టు విచారణలో వెల్లడైన అంశాల మేరకు ఈ ఘటన ఏడారిలోని ఓ రిమోట్ ఏరియాలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న దోషులు ముగ్గురు ఎమ్.ఎమ్, ఎస్.ఎమ్, ఏఎస్ తమను ఒక్కసారిగా ముట్టడించినట్లు బాధితురాలు తమ ఫిర్యాదులో పేర్కొంది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని ఇద్దరు కత్తులతో బెదిరించగా, మూడో వ్యక్తి బాధితురాలిపై అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు ప్రతిఘటించటంతో మిగిలిన ఇద్దరు వ్యక్తులు కూడా అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. అయితే..ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న ఇంకో బాధితుడు పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాము రావటం గమనించిన దోషులు తప్పించుకునేందుకు ప్రయత్నించారని, అయినా..వేటాడి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రయత్నంలో తమ వాహనాన్ని కూడా డ్యామేజ్ చేశారని అన్నారు. కేసు విచారణలో దోషులు నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ కావటంతో పలు సెక్షన్ల కింద గరిష్ట శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం. మొదటి దోషి ఎమ్.ఎమ్ కి 1,10,000 దిర్హామ్ ల ఫైన్ విధించింది. మిగిలిన ఇద్దరు దోషులు ఎస్.ఎమ్, ఏఎస్ లకు చెరో 50,000 దిర్హామ్ ల ఫైన్ విధించింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







