స్లైసింగ్ మెషిన్ తో గోళ్లను శుభ్రం చేసుకున్న వర్కర్..పండ్ల షాపు సీజ్
- February 20, 2021
ఫుజైరా:పండ్లు, కూరగాయలను కోయడానికి ఉపయోగించే స్లైసింగ్ మెషిన్ తో గోళ్లను శుభ్రం చేసుకున్నాడు ఓ కార్మికుడు. అతని బాగోతాన్ని కాస్త వీడియో తీసిన వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావటంతో ఏకంగా ఆ పండ్లు, కూరగాయల షాప్ సీజ్ అయ్యింది. యూఏఈలోని ఫుజైరాలో ఈ ఘటన చోటు చేసుకుంది.అసలే కరోనా సమయం..గ్లౌజులు ధరించిగానీ కూరగాయలు, పండ్లు ముట్టుకోవటం కూడా మంచిది కాదు. కానీ, ఫుజైరాలోని ఓ పండ్లు, కూరగాయల షాపులో పని చేసే వ్యక్తి ఏకంగా స్లైసింగ్ మెషిన్ తో తన గోర్లను శుభ్రం చేసుకున్నాడు. అది చూసిన వినియోగదారులు అతని నిర్లక్ష్యాన్ని వెంటనే వీడియో తీశారు.వీడియో వైరల్ కావటంతో ఫుజైరా మున్సిపాలిటీ బృందం పండ్లు, కూరగాయల షాపులో తనిఖీలు నిర్వహించి విచారణ చేపట్టింది.ఆహార పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినట్లు రుజువు కావటంతో షాపును మూసివేసింది. అహార భద్రతకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించింది. అహార శుభ్రత నియమాలను ఉల్లంఘించినట్లు గమనిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు అధికారులు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







