స్లైసింగ్ మెషిన్ తో గోళ్లను శుభ్రం చేసుకున్న వర్కర్..పండ్ల షాపు సీజ్
- February 20, 2021
ఫుజైరా:పండ్లు, కూరగాయలను కోయడానికి ఉపయోగించే స్లైసింగ్ మెషిన్ తో గోళ్లను శుభ్రం చేసుకున్నాడు ఓ కార్మికుడు. అతని బాగోతాన్ని కాస్త వీడియో తీసిన వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావటంతో ఏకంగా ఆ పండ్లు, కూరగాయల షాప్ సీజ్ అయ్యింది. యూఏఈలోని ఫుజైరాలో ఈ ఘటన చోటు చేసుకుంది.అసలే కరోనా సమయం..గ్లౌజులు ధరించిగానీ కూరగాయలు, పండ్లు ముట్టుకోవటం కూడా మంచిది కాదు. కానీ, ఫుజైరాలోని ఓ పండ్లు, కూరగాయల షాపులో పని చేసే వ్యక్తి ఏకంగా స్లైసింగ్ మెషిన్ తో తన గోర్లను శుభ్రం చేసుకున్నాడు. అది చూసిన వినియోగదారులు అతని నిర్లక్ష్యాన్ని వెంటనే వీడియో తీశారు.వీడియో వైరల్ కావటంతో ఫుజైరా మున్సిపాలిటీ బృందం పండ్లు, కూరగాయల షాపులో తనిఖీలు నిర్వహించి విచారణ చేపట్టింది.ఆహార పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినట్లు రుజువు కావటంతో షాపును మూసివేసింది. అహార భద్రతకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించింది. అహార శుభ్రత నియమాలను ఉల్లంఘించినట్లు గమనిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు అధికారులు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం