పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఏ.పి డీ.జీ.పి గౌతమ్ సవాంగ్
- February 20, 2021
ఏ.పి:ఈ రోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర డీ.జీ.పి.,గౌతమ్ సవాంగ్ ., శ్రీకాకుళం జిల్లాలో సందర్శించి ఎచ్చెర్ల మండలంలోని ఎచ్చెర్ల గ్రామంలో ఎం.పి.యూ.పి., పాఠశాలలొ గల పోలింగ్ కేంద్రంను పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రం వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించి, ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ అధికారులు మరియు సిబ్బందితో మాట్లాడి పలు దిశ నిర్దేశాలు చేశాను. అనంతరం ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో పోలీస్ కమ్యూనిటీ హాల్ నందు జిల్లా అధికారులుతో 2021 గ్రామ పంచాయతీ ఎన్నికలుపై సమీక్ష సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా డీ.జీ.పీ., మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుతగా మరియు సజావుగా జరిగాయి అని కొనియాడారు.

అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన,ఎన్నికల సమయంలో సామజిక దృక్పథంతో వృద్ధులు, వికలాంగులుకు ఓటు వేసేందుకు చేయూత అందించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి మరియు గ్రామ మహిళా కార్యదర్శిలకు ప్రశంసాపత్రాన్ని అందించి ప్రత్యేక అభినందనలు తెలియజేసినారు.డీజీపీ తో విశాఖపట్నం రేంజి డి.ఐ.జి., ఎల్.కె.వి., రంగరావు , జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మరియు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆయా కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







