అందమైన భామలతో మసాజ్ అంటూ ఘరానా మోసం...
- February 20, 2021
దుబాయ్:భారత్ కు చెందిన ఓ వ్యక్తి అందమైన భామలతో మసాజ్ చేయించుకుని ఎంజాయ్ చేయాలని ఆశపడ్డాడు. కానీ,అతని ఆశలు అడియాసలయ్యాయి. అంతేకాకుండా 280,000 దిర్హాములను పోగొట్టుకున్నాడు.చివరికి పోలీసులను ఆశ్రయించాడు.ఈ ఘటన దుబాయ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..భారత్ కు చెందిన 33 ఏళ్ల వ్యక్తి.. గత ఏడాది చివరలో సోషల్ మీడియా డేటింగ్ యాప్లో మసాజ్కు సంబంధించిన ఆఫర్ మేసేజ్ను చూసి..కేవలం 200 దిర్హమ్లకే అందమైన భామలతో మసాజ్ చేయించుకోవచ్చని ఆశపడ్డాడు.అందమైన భామలతో మసాజ్ చేయించుకోవచ్చని ఆశపడ్డాడు.మేసేజ్లో ఉన్న నెంబర్కు ఫోన్ చేసి..అడ్రస్ తెలసుకుని..అక్కడకు వెళ్ళాడు.
తీరా అక్కడి వెళ్లాక.. నైజీరియాకు చెందిన నలుగురు మహిళలు అతను ఫ్లాట్కు చేరుకోగానే మహిళలు అతన్ని నిర్బంధించి కత్తితో బెదిరించారు. వారు అతని బ్యాంకింగ్ వివరాలన్నింటినీ బహిర్గతం చేయమని బలవంతం చేసారు మరియు అతని ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్ ఉపయోగించి అతని బ్యాంక్ ఖాతాలో ఉన్న 2,50,000 దిర్హాములు ఇతర ఖాతాలకు డబ్బును బదిలీ చేసారు.క్రెడిట్ కార్డు నుంచి 30,000 దిర్హాములు ఏ.టి.యం ద్వారా బలవంతంగా డ్రా చేయించారు.
అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నైజీరియాకు చెందిన ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.అంతేకాకుండా వారిని కోర్టులో హాజరుపర్చారు.ఈ కేసుపై ప్రస్తుతం కోర్టు విచారణ జరుపుతోంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







