అందమైన భామలతో మసాజ్ అంటూ ఘరానా మోసం...
- February 20, 2021
దుబాయ్:భారత్ కు చెందిన ఓ వ్యక్తి అందమైన భామలతో మసాజ్ చేయించుకుని ఎంజాయ్ చేయాలని ఆశపడ్డాడు. కానీ,అతని ఆశలు అడియాసలయ్యాయి. అంతేకాకుండా 280,000 దిర్హాములను పోగొట్టుకున్నాడు.చివరికి పోలీసులను ఆశ్రయించాడు.ఈ ఘటన దుబాయ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..భారత్ కు చెందిన 33 ఏళ్ల వ్యక్తి.. గత ఏడాది చివరలో సోషల్ మీడియా డేటింగ్ యాప్లో మసాజ్కు సంబంధించిన ఆఫర్ మేసేజ్ను చూసి..కేవలం 200 దిర్హమ్లకే అందమైన భామలతో మసాజ్ చేయించుకోవచ్చని ఆశపడ్డాడు.అందమైన భామలతో మసాజ్ చేయించుకోవచ్చని ఆశపడ్డాడు.మేసేజ్లో ఉన్న నెంబర్కు ఫోన్ చేసి..అడ్రస్ తెలసుకుని..అక్కడకు వెళ్ళాడు.
తీరా అక్కడి వెళ్లాక.. నైజీరియాకు చెందిన నలుగురు మహిళలు అతను ఫ్లాట్కు చేరుకోగానే మహిళలు అతన్ని నిర్బంధించి కత్తితో బెదిరించారు. వారు అతని బ్యాంకింగ్ వివరాలన్నింటినీ బహిర్గతం చేయమని బలవంతం చేసారు మరియు అతని ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్ ఉపయోగించి అతని బ్యాంక్ ఖాతాలో ఉన్న 2,50,000 దిర్హాములు ఇతర ఖాతాలకు డబ్బును బదిలీ చేసారు.క్రెడిట్ కార్డు నుంచి 30,000 దిర్హాములు ఏ.టి.యం ద్వారా బలవంతంగా డ్రా చేయించారు.
అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నైజీరియాకు చెందిన ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.అంతేకాకుండా వారిని కోర్టులో హాజరుపర్చారు.ఈ కేసుపై ప్రస్తుతం కోర్టు విచారణ జరుపుతోంది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







