అందమైన భామలతో మసాజ్ అంటూ ఘరానా మోసం...
- February 20, 2021
దుబాయ్:భారత్ కు చెందిన ఓ వ్యక్తి అందమైన భామలతో మసాజ్ చేయించుకుని ఎంజాయ్ చేయాలని ఆశపడ్డాడు. కానీ,అతని ఆశలు అడియాసలయ్యాయి. అంతేకాకుండా 280,000 దిర్హాములను పోగొట్టుకున్నాడు.చివరికి పోలీసులను ఆశ్రయించాడు.ఈ ఘటన దుబాయ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..భారత్ కు చెందిన 33 ఏళ్ల వ్యక్తి.. గత ఏడాది చివరలో సోషల్ మీడియా డేటింగ్ యాప్లో మసాజ్కు సంబంధించిన ఆఫర్ మేసేజ్ను చూసి..కేవలం 200 దిర్హమ్లకే అందమైన భామలతో మసాజ్ చేయించుకోవచ్చని ఆశపడ్డాడు.అందమైన భామలతో మసాజ్ చేయించుకోవచ్చని ఆశపడ్డాడు.మేసేజ్లో ఉన్న నెంబర్కు ఫోన్ చేసి..అడ్రస్ తెలసుకుని..అక్కడకు వెళ్ళాడు.
తీరా అక్కడి వెళ్లాక.. నైజీరియాకు చెందిన నలుగురు మహిళలు అతను ఫ్లాట్కు చేరుకోగానే మహిళలు అతన్ని నిర్బంధించి కత్తితో బెదిరించారు. వారు అతని బ్యాంకింగ్ వివరాలన్నింటినీ బహిర్గతం చేయమని బలవంతం చేసారు మరియు అతని ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్ ఉపయోగించి అతని బ్యాంక్ ఖాతాలో ఉన్న 2,50,000 దిర్హాములు ఇతర ఖాతాలకు డబ్బును బదిలీ చేసారు.క్రెడిట్ కార్డు నుంచి 30,000 దిర్హాములు ఏ.టి.యం ద్వారా బలవంతంగా డ్రా చేయించారు.
అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నైజీరియాకు చెందిన ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.అంతేకాకుండా వారిని కోర్టులో హాజరుపర్చారు.ఈ కేసుపై ప్రస్తుతం కోర్టు విచారణ జరుపుతోంది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం