ఏ.పిలో కరోనా కేసుల వివరాలు
- February 21, 2021అమరావతి: భారత దేశవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఇప్పటికే జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు కరోనా పరీక్షలు పెంచుతోంది.అయినప్పటికీ కొత్త కేసులు పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో 31,680 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 88 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,89,298కి చేరింది.ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,167 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 24గంటల వ్యవధిలో రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల నుంచి 72 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక, ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,81,511కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 620 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,37,28,728 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు