మేక్ ఇన్ ఇండియా వేదికపై బహ్రెయిన్, ఇండియా ప్రముఖులు
- February 26, 2016
బహ్రెయిన్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న డెలిగేషన్ బృందం, అలాగే బహ్రెయిన్ ఇండియా సొసైటీ ప్రముఖులు బహ్రెయిన్ సామర్థ్యాన్ని, 'మేక్ ఇన్ ఇండియా షో' వేదిక సాక్షిగా భారత ప్రముఖులతో పంచుకున్నారు. భారత ప్రధాని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్కి తమ వంతు సహకారం అందిస్తామని బహ్రెయిన్ డెలిగేషన్ వెల్లడించింది. దాదాబాయ్ మరియు బిఐఎస్ ఫౌండర్ అబ్దుల్ నబీ అల్ షోఅలా, ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయిన్లో పెట్టుబడులు పెడుతున్న ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన 40 మంది ప్రముఖ బిజినెస్ లీడర్స్ని కూడా ఆయన తన వెంట తీసుకువెళ్ళారు. పరుగులు పెడుతున్న భారత ఆర్థిక వ్యవస్థను చూసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉందని దాదాబాయ్ చెప్పారు. భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ఇదే సరైన సమయం అనీ, భారతీయ కంపెనీలు గల్ఫ్ దేశాల వైపు దృష్టి సారిస్తుండడం అభినందనీయమనీ పలువురు వ్యాఖ్యానించారు. భారతీయ కంపెనీలు, బిజినెస్ లీడర్స్ బహ్రెయిన్ ఎకనమిక్ పాలసీల పట్ల ఆకర్షితులై ఉన్నారని దాదాబాయ్ చెప్పారు. ఇరు దేశాలూ మంచి అవగాహనతో ముందుకు వెళ్తాయనీ, పరస్పరం వివిధ రంగాల్లో సహకారం అందించుకోవాల్సి ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







