ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పూర్తితో ఇండియా కూడా..
- February 25, 2021
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో స్ఫూర్తి పొందిన ఇండియన్ న్యూస్పేపర్స్ అసోసియేషన్ కూడా ఇప్పుడు గూగుల్ను పరిహారం అడుగుతోంది. తమ కంటెంట్ను వాడుకుంటున్నందుకు గూగుల్ తన యాడ్ రెవెన్యూలో 85 శాతం ఇవ్వాలని ఇండియన్ న్యూస్పేపర్స్ సొసైటీ (ఐఎన్ఎస్) డిమాండ్ చేస్తోంది. దేశంలోని వెయ్యి పత్రికలు ఈ సొసైటీలో ఉన్నాయి. తాము వేలాది మంది జర్నలిస్టులకు జీతాలు చెల్లిస్తూ ఇస్తున్న వార్తలకు గూగుల్ పరిహారం ఇవ్వాలని ఈ సొసైటీ స్పష్టం చేసింది. న్యూస్ వాడుకుంటున్నందుకు పత్రికలకు డబ్బులు చెల్లించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
అదే దారిలో ఇప్పుడు భారత వార్తాపత్రికలు కూడా వెళ్తున్నాయి. తాము ఎంతో ఖర్చు చేసి ఇస్తున్న విశ్వసనీయ సమాచారాన్ని గూగుల్కు మొదటి నుంచీ ఇస్తున్నామని ఐఎన్ఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడాది కాలంగా ఇందులోనూ తమకు వాటా ఇవ్వాలని ప్రపంచవ్యాప్తంగా పలు పత్రికలు గూగుల్ను డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఐఎన్ఎస్ ప్రస్తావించింది. ఈ మధ్యే ఫ్రాన్స్, యురోపియన్ యూనియన్, ఆస్ట్రేలియాలోనూ పరిహారం చెల్లించడానికి గూగుల్ అంగీకరించిందని కూడా తెలిపింది. పత్రికలు ప్రధానంగా యాడ్స్పైనే ఆధారపడతాయని, అయితే డిజిటల్ స్పేస్లో మాత్రం మెజార్టీ వాటాను గూగుల్ తీసుకుంటోందని ఆరోపించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







