ఈ గవర్నెన్స్లో తెలంగాణ టాప్.. బెస్ట్ ఐటీ మినిస్టర్ కేటీఆర్
- February 25, 2021
హైదరాబాద్ : ఈ-గవర్నెన్స్లో తెలంగాణ రాష్ట్రం దూసుకెళుతుంది. దేశంలోనే ముందంజలో ఉందని మరోమారు నిరూపితమైంది. ఈ-గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నందుకుగాను 2020 ఏడాదికిగాను రాష్ర్టానికి స్కోచ్ గ్రూప్ ఈ-గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. అదేవిధంగా ఐటీ మంత్రిగా ఉత్తమ పనితీరుకు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను స్కోచ్ బెస్ట్ ఫెర్మార్మింగ్ ఐటీ మినిస్టర్ అవార్డు వరించింది. కొవిడ్-19 సంక్షోభంలోనూ మెరుగైన ప్రజా సేవలు అందించేందుకు తెలంగాణ ఆధునిక సాంకేతికను విరివిగా వినియోగించుకుంది. 2016లో సైతం మంత్రి కేటీఆర్ స్కోచ్ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్నారు. దేశంలోనే రెండు సార్లు స్కోచ్ అవార్డు దక్కించుకున్న ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్ రికార్డు నెలకొల్పారు.

తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







