ఈ గవర్నెన్స్‌లో తెలంగాణ టాప్‌.. బెస్ట్‌ ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌

- February 25, 2021 , by Maagulf
ఈ గవర్నెన్స్‌లో తెలంగాణ టాప్‌.. బెస్ట్‌ ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌

హైదరాబాద్ : ఈ-గవర్నెన్స్‌లో తెలంగాణ రాష్ట్రం దూసుకెళుతుంది. దేశంలోనే ముందంజలో ఉందని మరోమారు నిరూపితమైంది. ఈ-గవర్నెన్స్‌ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నందుకుగాను 2020 ఏడాదికిగాను రాష్ర్టానికి స్కోచ్‌ గ్రూప్‌ ఈ-గవర్నెన్స్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు లభించింది. అదేవిధంగా ఐటీ మంత్రిగా ఉత్తమ పనితీరుకు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను స్కోచ్‌ బెస్ట్‌ ఫెర్మార్మింగ్‌ ఐటీ మినిస్టర్‌ అవార్డు వరించింది. కొవిడ్‌-19 సంక్షోభంలోనూ మెరుగైన ప్రజా సేవలు అందించేందుకు తెలంగాణ ఆధునిక సాంకేతికను విరివిగా వినియోగించుకుంది. 2016లో సైతం మంత్రి కేటీఆర్‌ స్కోచ్‌ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నారు. దేశంలోనే రెండు సార్లు స్కోచ్‌ అవార్డు దక్కించుకున్న ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్‌ రికార్డు నెలకొల్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com