భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్ (3-0)

- February 26, 2016 , by Maagulf
భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్ (3-0)

మూడో టి20లోనూ ఓడిన లంక రాంచీ: శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్ (3-0) చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన మిథాలీసేన... శుక్రవారం జరిగిన మూడో టి20లో 9 వికెట్ల తేడాతో నెగ్గింది. జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 89 పరుగులు చేసింది. కౌసల్య (25 నాటౌట్), జయాంగిణి (21), కంచన (17), హాన్సిక (13)లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు సాధించారు. ఏక్తా బిస్త్ 3, అనుజా 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. సృ్మతి మందన (43 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు), వనిత (25 బంతుల్లో 34; 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు.వేద కృష్ణమూర్తి (13 నాటౌట్) ఫర్వాలేదనిపించింది. మందనకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com