భారత మహిళల జట్టు క్లీన్స్వీప్ (3-0)
- February 26, 2016మూడో టి20లోనూ ఓడిన లంక రాంచీ: శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను భారత మహిళల జట్టు క్లీన్స్వీప్ (3-0) చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన మిథాలీసేన... శుక్రవారం జరిగిన మూడో టి20లో 9 వికెట్ల తేడాతో నెగ్గింది. జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో... టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 89 పరుగులు చేసింది. కౌసల్య (25 నాటౌట్), జయాంగిణి (21), కంచన (17), హాన్సిక (13)లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు సాధించారు. ఏక్తా బిస్త్ 3, అనుజా 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. సృ్మతి మందన (43 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు), వనిత (25 బంతుల్లో 34; 5 ఫోర్లు) తొలి వికెట్కు 64 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు.వేద కృష్ణమూర్తి (13 నాటౌట్) ఫర్వాలేదనిపించింది. మందనకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..