భారత మహిళల జట్టు క్లీన్స్వీప్ (3-0)
- February 26, 2016
మూడో టి20లోనూ ఓడిన లంక రాంచీ: శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను భారత మహిళల జట్టు క్లీన్స్వీప్ (3-0) చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన మిథాలీసేన... శుక్రవారం జరిగిన మూడో టి20లో 9 వికెట్ల తేడాతో నెగ్గింది. జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో... టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 89 పరుగులు చేసింది. కౌసల్య (25 నాటౌట్), జయాంగిణి (21), కంచన (17), హాన్సిక (13)లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు సాధించారు. ఏక్తా బిస్త్ 3, అనుజా 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. సృ్మతి మందన (43 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు), వనిత (25 బంతుల్లో 34; 5 ఫోర్లు) తొలి వికెట్కు 64 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు.వేద కృష్ణమూర్తి (13 నాటౌట్) ఫర్వాలేదనిపించింది. మందనకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









