భారత మహిళల జట్టు క్లీన్స్వీప్ (3-0)
- February 26, 2016
మూడో టి20లోనూ ఓడిన లంక రాంచీ: శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను భారత మహిళల జట్టు క్లీన్స్వీప్ (3-0) చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన మిథాలీసేన... శుక్రవారం జరిగిన మూడో టి20లో 9 వికెట్ల తేడాతో నెగ్గింది. జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో... టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 89 పరుగులు చేసింది. కౌసల్య (25 నాటౌట్), జయాంగిణి (21), కంచన (17), హాన్సిక (13)లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు సాధించారు. ఏక్తా బిస్త్ 3, అనుజా 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. సృ్మతి మందన (43 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు), వనిత (25 బంతుల్లో 34; 5 ఫోర్లు) తొలి వికెట్కు 64 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు.వేద కృష్ణమూర్తి (13 నాటౌట్) ఫర్వాలేదనిపించింది. మందనకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







