దుబాయ్:ఛారిటీల పేరుతో మోసాలకు పాల్పడితే 5,00,000 దిర్హామ్ ల ఫైన్
- February 28, 2021
దుబాయ్:కోవిడ్ సంక్షోభ పరిస్థితులను ఆసరాగా చేసుకొని ఛారీటీలు, స్వచ్ఛంద సంస్థల పేరుతో అక్రమంగా విరాళాలు సేకరిస్తే సహించబోమని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. ఈజీ మనీ కోసం కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా స్వచ్ఛంద సంస్థల పేరుతో విరాళాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించింది. డబ్బు సంపాదన కోసం చారిటీల పేరుతో ఫండ్ రైజింగ్ చేసేందుకు ప్రయత్నిస్తే 2,50,000 నుంచి 5,00,000 దిర్హామ్ ల వరకు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి మోసగాళ్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పోలీసులు..కేవలం ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఆర్గనైజేషన్లకు మాత్రమే విరాళాలు ఇవ్వాలని సూచించారు. మోసగాళ్ల అభ్యర్ధనకు కరిగిపోకుండా..వాళ్లు చెబుతున్న సంస్థకు గుర్తింపు ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాతే సాయం చేయాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









