దుబాయ్:ఛారిటీల పేరుతో మోసాలకు పాల్పడితే 5,00,000 దిర్హామ్ ల ఫైన్
- February 28, 2021
దుబాయ్:కోవిడ్ సంక్షోభ పరిస్థితులను ఆసరాగా చేసుకొని ఛారీటీలు, స్వచ్ఛంద సంస్థల పేరుతో అక్రమంగా విరాళాలు సేకరిస్తే సహించబోమని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. ఈజీ మనీ కోసం కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా స్వచ్ఛంద సంస్థల పేరుతో విరాళాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించింది. డబ్బు సంపాదన కోసం చారిటీల పేరుతో ఫండ్ రైజింగ్ చేసేందుకు ప్రయత్నిస్తే 2,50,000 నుంచి 5,00,000 దిర్హామ్ ల వరకు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి మోసగాళ్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పోలీసులు..కేవలం ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఆర్గనైజేషన్లకు మాత్రమే విరాళాలు ఇవ్వాలని సూచించారు. మోసగాళ్ల అభ్యర్ధనకు కరిగిపోకుండా..వాళ్లు చెబుతున్న సంస్థకు గుర్తింపు ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాతే సాయం చేయాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







