దుబాయ్:ఛారిటీల పేరుతో మోసాలకు పాల్పడితే 5,00,000 దిర్హామ్ ల ఫైన్

- February 28, 2021 , by Maagulf
దుబాయ్:ఛారిటీల పేరుతో మోసాలకు పాల్పడితే 5,00,000 దిర్హామ్ ల ఫైన్

దుబాయ్:కోవిడ్ సంక్షోభ పరిస్థితులను ఆసరాగా చేసుకొని ఛారీటీలు, స్వచ్ఛంద సంస్థల పేరుతో అక్రమంగా విరాళాలు సేకరిస్తే సహించబోమని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. ఈజీ మనీ కోసం కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా స్వచ్ఛంద సంస్థల పేరుతో విరాళాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించింది. డబ్బు సంపాదన కోసం చారిటీల పేరుతో ఫండ్ రైజింగ్ చేసేందుకు ప్రయత్నిస్తే 2,50,000 నుంచి 5,00,000 దిర్హామ్ ల వరకు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి మోసగాళ్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పోలీసులు..కేవలం ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఆర్గనైజేషన్లకు మాత్రమే విరాళాలు ఇవ్వాలని సూచించారు. మోసగాళ్ల అభ్యర్ధనకు కరిగిపోకుండా..వాళ్లు చెబుతున్న సంస్థకు గుర్తింపు ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాతే సాయం చేయాలని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com