టీడీపీ కువైట్ మహానాడులో కోడెల శివప్రసాద్

- May 30, 2015 , by Maagulf
టీడీపీ కువైట్ మహానాడులో కోడెల శివప్రసాద్

‘తెలుగుదేశం పార్టీ - కువైట్’ ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కువైట్లోని తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ ‘టీడీపీ కువైట్ మహానాడు’ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శుక్రవారం మే 29వ తేదీ సాయంత్రం 4 గంటలనుండి కువైట్ బాయ్స్ స్కవుట్ అసోసియేషన్, హవల్లీ సెంటర్ పాయింట్ ఎదురుగా మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకులు, వారి బృందం సంగీత విభావరి నిర్వహించింది. ఆహూతుల్ని ఈ సంగీత విభావరి అలరించింది. కార్యక్రమం అనంతరం రుచికరమైన విందును ఆస్వాదించారు ‘మహానాడు’లో పాల్గొన్నవారు. మా గల్ఫ్ డాట్ కామ్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com