ఎమిరేట్స్ ప్రయాణీకులు ఖాళీగా వున్న పక్క సీటుని కొనుగోలు చేసే అవకాశం
- March 01, 2021దుబాయ్:ఎకానమీ క్లాస్లో ప్రయాణించే ఎమిరేట్స్ ప్రయాణీకులు, తమ పక్కనున్న ఖాళీ సీట్ని కూడా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.తద్వారా మరింత సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలు కలగనుంది.ఎకానమీ క్లాస్ వినియోగదారులందరికీ ఈ అవకాశం వుంటుందని ఎమిరేట్స్ వెల్లడించింది.ఎయిర్ పోర్టు చెక్ ఇన్ కౌంటర్ వద్ద విమానం బయల్దేరడానికి కొద్ది సమయం ముందు మాత్రమే వీటిని కొనుగోలు చేయడానికి వీలవుతుంది. 200 దిర్హాముల నుంచి 600 దిర్హాముల వరకు ఈ సీట్ల ధరలు వుంటాయి. పన్నులు అదనం.ఒక వరుసలో అత్యధికంగా మూడు సీట్లను పొందే అవకాశం వుంటుంది.చిన్న పిల్లలతో వెళ్ళే తల్లిదండ్రులు అలాగే భార్యా భర్తలకు, కరోనా నేపథ్యంలో అదనపు సౌకర్యం, భద్రత కోసం చూసేవారు ఈ వెసులుబాటుని వినియోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం