ఎమిరేట్స్ ప్రయాణీకులు ఖాళీగా వున్న పక్క సీటుని కొనుగోలు చేసే అవకాశం
- March 01, 2021
దుబాయ్:ఎకానమీ క్లాస్లో ప్రయాణించే ఎమిరేట్స్ ప్రయాణీకులు, తమ పక్కనున్న ఖాళీ సీట్ని కూడా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.తద్వారా మరింత సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలు కలగనుంది.ఎకానమీ క్లాస్ వినియోగదారులందరికీ ఈ అవకాశం వుంటుందని ఎమిరేట్స్ వెల్లడించింది.ఎయిర్ పోర్టు చెక్ ఇన్ కౌంటర్ వద్ద విమానం బయల్దేరడానికి కొద్ది సమయం ముందు మాత్రమే వీటిని కొనుగోలు చేయడానికి వీలవుతుంది. 200 దిర్హాముల నుంచి 600 దిర్హాముల వరకు ఈ సీట్ల ధరలు వుంటాయి. పన్నులు అదనం.ఒక వరుసలో అత్యధికంగా మూడు సీట్లను పొందే అవకాశం వుంటుంది.చిన్న పిల్లలతో వెళ్ళే తల్లిదండ్రులు అలాగే భార్యా భర్తలకు, కరోనా నేపథ్యంలో అదనపు సౌకర్యం, భద్రత కోసం చూసేవారు ఈ వెసులుబాటుని వినియోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







