ఎమిరేట్స్ ప్రయాణీకులు ఖాళీగా వున్న పక్క సీటుని కొనుగోలు చేసే అవకాశం
- March 01, 2021దుబాయ్:ఎకానమీ క్లాస్లో ప్రయాణించే ఎమిరేట్స్ ప్రయాణీకులు, తమ పక్కనున్న ఖాళీ సీట్ని కూడా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.తద్వారా మరింత సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలు కలగనుంది.ఎకానమీ క్లాస్ వినియోగదారులందరికీ ఈ అవకాశం వుంటుందని ఎమిరేట్స్ వెల్లడించింది.ఎయిర్ పోర్టు చెక్ ఇన్ కౌంటర్ వద్ద విమానం బయల్దేరడానికి కొద్ది సమయం ముందు మాత్రమే వీటిని కొనుగోలు చేయడానికి వీలవుతుంది. 200 దిర్హాముల నుంచి 600 దిర్హాముల వరకు ఈ సీట్ల ధరలు వుంటాయి. పన్నులు అదనం.ఒక వరుసలో అత్యధికంగా మూడు సీట్లను పొందే అవకాశం వుంటుంది.చిన్న పిల్లలతో వెళ్ళే తల్లిదండ్రులు అలాగే భార్యా భర్తలకు, కరోనా నేపథ్యంలో అదనపు సౌకర్యం, భద్రత కోసం చూసేవారు ఈ వెసులుబాటుని వినియోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం