కోవిడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తున్న 93 శాతం దుబాయ్ స్కూళ్ళు

- March 02, 2021 , by Maagulf
కోవిడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తున్న 93 శాతం దుబాయ్ స్కూళ్ళు

దుబాయ్:నాలెడ్జ్ అండ్ హ్యమూన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) వెల్లడించిన వివరాల ప్రకారం, దుబాయ్ స్కూళ్ళు కరోనా నేపథ్యంలో తెరపైకొచ్చిన ‘న్యూ నార్మల్’ విధానాల్ని ఖచ్చితంగా పాటిస్తున్నాయని తెలుస్తోంది. కెహెచ్‌డిఎ బృందాలు 20 ఆకస్మిక తనిఖీలను స్కూళ్ళలో ప్రతిరోజూ నిర్వహిస్తున్నాయి. ఈ తనిఖీల సందర్భంగా 93 శాతం స్కూళ్ళు న్యూ నార్మల్ విధానాల్ని పాటిస్తున్నట్లు తేలింది. ముఖాముఖి విద్యాభ్యాసానికి సంబంధించి 50 శాతం మంది విద్యార్థులు ముందుకొచ్చినట్లు తెలిపాయి అథారిటీస్. 15,000 మందికి పైగా విద్యార్థులు (పీపుల్ ఆఫ్ డిట్మరినేషన్) ప్రత్యేక సాయాన్ని కోవిడ్ సమయంలో అందుకోవడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com