SBI కస్టమర్లకు హెచ్చరిక
- March 02, 2021
భారత దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIలో అకౌంట్ ఉన్న కస్టమర్లు హ్యాకర్ల నుంచి రక్షించుకునేందుకు ఎప్పటికప్పుడు బ్యాంకు పలు హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. అందులో భాగంగానే మరోసారి మోసగాళ్లు తమ ఖాతాదారులను టార్గెట్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కస్టమర్లకు బ్యాంకు టెక్స్ట్ మెసేజ్లు పంపించినట్లు తెలుస్తోంది.ఇందులో రూ.9,870 విలువైన ఎస్బీఐ క్రెడిట్ పాయింట్లను రిడీమ్ చేసుకోవాలని ఉంటుంది.ఈ మెసేజ్లో ఒక లింక్ కూడా ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి పాయింట్లు రిడీమ్ చేసుకోవాలని మోసగాళ్లు మెసేజ్ పంపుతారు.
మీరు ఈ మెసేజ్ను నమ్మి లింక్పై క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది. ఎలా అంటే మీరు లింక్పై క్లిక్ చేస్తే ఫేక్ వెబ్సైట్ ఒకటి ఓపెనవుతుంది. ఇందులో మీరు మీ ఎస్బీఐ వివరాలను ఎంటర్ చేస్తారు. ఈ డేటాను మోసగాళ్లు తస్కరిస్తారు. వీటి ద్వారానే మీ బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు వాళ్ల అకౌంట్లోకి ట్రాన్సఫర్ అవుతాయి. సైబర్ నేరగాళ్లు ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్లో ఉండే ఎస్బీఐ కస్టమర్లను టార్గెట్ చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అందువలన ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఏ లింక్ పైనా క్లిక్ చేయొద్దని బ్యాంక్ చెబుతోంది. లేదంటే మీకు తెలియకుండానే అకౌంట్ ఖాళీ అయిపోతుంది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







