షార్జా-భారత్ విమానం...పాకిస్తాన్ లో అత్యవసర లాండింగ్
- March 02, 2021
షార్జా నుంచి భారత్ కు వస్తున్న భారత విమానమొకటి పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమాన ప్రయాణికుల్లో ఒకరు మరణించడంతో పైలట్ ఈ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ లాండింగ్ చేసినట్టు సమాచారం.అయితే చివరకు ఈ విమానం ఈ ఉదయం లక్నో విమానాశ్రయంలో దిగింది. గత ఏడాది నవంబరులో 179 మంది ప్రయాణికులతో ఢిల్లీకి వస్తున్న గో-ఎయిర్ విమానం కూడా కరాచీ విమానాశ్రయంలోనే దిగింది. విమాన ప్రయాణికుడొకరికి గుండె పోటు రావడంతో విమానంలోనే అతనికి అత్యవసర వైద్య చికిత్స చేశారు.అయితే విమానం కరాచీ ఎయిర్ పోర్టులో దిగగానే అతడు మృతి చెందాడు.కాగా తాజా సంఘటనకు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..









